సీఎం గారూ...బడి బాట సరే...మా బడికి దారేది....?
*స్కూల్ దారి కోసం బడిపంతులు ధర్నా
*బస్తీలోని పేద, దళిత విద్యార్థుల స్కూల్ పై వివక్ష
*స్కూల్ కు అడ్డంగా నిర్మించిన గోడ తొలగించాలని సీపీఐ నాయకులతో కలిసి నిరసన
సికింద్రాబాద్ మే 26 (ప్రజామంటలు) :
బడికి దారి కోసం బడిపంతులు ఆందోళనకు దిగారు. పేద పిల్లలు చదివే పాఠశాలకు కొందరు దారికి అడ్డంగా గోడ నిర్మించి దారిలేకుండా చేశారని, సీఎం గారూ..మాబడికి దారేది..అంటూ ప్లెక్సీతో నిరసన చేపట్టారు.పంతులు చేస్తున్న ఆందోళనకు సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటించి ఆయనతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ పాఠశాల కు అడ్డంగా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి బడికి బాట ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి , సీపీఐ నాయకులుతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ..పేద,దళిత వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలకు అడ్డంగా ప్రహరీగోడ నిర్మించారని, దీంతో విద్యార్థులకు స్కూల్లోని వెల్లడానికి దారి లేకుండా చేశారని అన్నారు.
ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించినా కోర్టు కేసును సాకుగా చూపి ఏడాది కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు బస్తీలకు చెందిన దళిత, పేద విద్యార్థులను మా కాలానికి రావొద్దు అంటూ వివక్షకు గురి చేస్తూ అడ్డంగా అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించి బడికి బాట ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు బడిబాట పేరుతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలోకి చేర్చాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు బడికి దారి లేక ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారని అన్నారు.
సంవత్సర కాలం నుండి కలెక్టర్ నుండి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ కింది స్థాయి అధికారి వరకు తిరిగినా పట్టించుకోవట్లేదని, జోనల్, కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ను టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.ఈ విషయంలో అధికారులు స్పందించి గోడను కూల్చివేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
