మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

On
మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ... ఉద్యమ కెరటం

(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494)

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భారతీయ విప్లవ రాజకీయ చరిత్రలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. జీవితాన్ని అజ్ఞాత రాజకీయాలకు అంకితం చేసిన ఆయన, అర్ధ శతాబ్దానికి పైగా మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మక నేతగా నిలిచాడు. ఆయన మరణం, మావోయిస్టు ఉద్యమానికి ఒక తలకిందుల మలుపుగా భావించ బడుతోంది.

ఆంధ్ర ప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించిన కేశవరావు, తన తండ్రి బడిపంతులు కావడంతో చిన్నతనంలోనే చదువుపట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. విద్యార్థి దశ నుంచే విప్లవ భావజాలాన్ని ఆకర్షణగా భావించిన ఆయన, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంసీఈలో ఎంటెక్ పూర్తిచేశాడు.1984లో విద్యార్థి జీవితంలోనే పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలతో మమేకమై ఉద్యమంలోకి అడుగు పెట్టాడు.IMG-20250521-WA0006

ప్రారంభ దశలోనే నక్సలైట్ ఉద్యమ స్ఫూర్తి నాయకుడు కొండపల్లి సీతారామయ్య ప్రభావం అతనిపై గాఢంగా పనిచేసింది. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడిగా పేరొందిన కొండపల్లి సిద్ధాంతాలతో కేశవరావు దీర్ఘకాలం సహకారం కలిగి పనిచేశాడు. ఈ సమయంలోనే ఆయన మావోయిస్టు ఉద్యమంలో తానేర్పరచుకున్న స్థానం బలపడింది.

ఉద్యమ జీవితం ప్రారంభంలోనే ప్రజాసేవ, భూసంస్కరణ, సమానత్వం వంటి అభ్యుదయ లక్ష్యాల కోసం పోరాడే నేతగా గుర్తింపు పొందిన ఆయన, పీపుల్స్ వార్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషించాడు. కాలక్రమేణ ఆ సంస్థలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో చేరి, భద్రతా వ్యూహాల రూపకర్తగా ఎదిగాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, మొబైల్ వార్‌ ఫేర్ పద్ధతులు, అడవుల్లో రహస్యంగా శిక్షణా శిబిరాల ఏర్పాటు వంటి వ్యవస్థలను రూపొందించి ఉద్యమాన్ని మిలిటరీంగా శక్తిమంతం చేశాడు.

1990లో మావోయిస్టు మిలిటరీ కమిషన్‌లో చేరిన కేశవరావు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఆర్మ్‌డ్ స్ట్రగుల్ వ్యూహాలకు రూపకర్తగా నిలిచాడు. అడవుల్లో గెరిల్లా యుద్ధ పద్ధతులు, ఐఈడీల వినియోగం, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ నిర్మాణం వంటి అంశాల్లో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మావోయిస్టు శక్తుల పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించాడు.

2004లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిశన్‌జీ నేతృత్వంలోని మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ)తో పీపుల్స్ వార్ విలీనం అయ్యింది. దీంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడింది. ఈ విలీనంలో బసవరాజు కీలక పాత్ర పోషించాడు. తదనంతరం కేశవరావు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కొనసాగుతూ రాజకీయ, సైనిక వ్యూహాల రూపకర్తగా ప్రసిద్ధి పొందాడు.

 ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి విరమించిన అనంతరం, బసవరాజు ఆ పదవిని చేపట్టి, మావోయిస్టు ఉద్యమానికి అత్యున్నత నేతగా బాధ్యతలు నిర్వహించాడు.
భారత ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ, ఎన్ఐఏ లకు బసవరాజు చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ నేత. అతని అరెస్ట్‌కు లేదా సమాచారం కోసం కోటి రూపాయలకు పైగా బహుమతి ప్రకటించ బడింది. చత్తీస్‌గఢ్‌లో 2010లో జరిగిన 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్య కేసు, 2018లో విశాఖపట్నం జిల్లా అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్య కేసుల వెనుక బసవరాజు కీలక మేథస్సుగా ఆరోపణలు వచ్చాయి. చెలామణి క్షేత్రాల్లో పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీ, ఆయుధాల సమీకరణ, విదేశీ సంబంధాల సృష్టి వంటి అంశాల్లోనూ బసవరాజు పాత్ర ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటాయి.

చాలా సంవత్సరాలుగా బసవరాజు అజ్ఞాత జీవితం గడుపుతూ, ప్రభుత్వ వ్యవస్థకు సవాలుగా మారాడు. ఎక్కడ ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా? అనే ప్రశ్నలు గత పదేళ్లుగా మావోయిస్టు వర్గాలు, ప్రభుత్వ వర్గాలలోనూ విస్తృతంగా చర్చకు వచ్చాయి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో నారాయణపూర్ అడవుల్లో భద్రతా దళాల నిర్వహించిన భారీ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో బసవరాజు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఆయనతోపాటు మరో 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిపింది. ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా తీవ్రమైన దెబ్బగా భావించ బడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధృవీకరించి ట్వీట్ చేశారు.

 ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన లోటుగా భావించ బడుతోంది. బసవరాజు మృతి, మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

నంబాల కేశవరావు జీవితం విప్లవ రాజకీయాల పట్ల నిబద్ధత, ఉద్యమ పట్ల త్యాగబుద్ధి, వ్యూహాత్మక మేధస్సు కలగలిపిన ప్రత్యేక చరిత్ర. ఆయన మృతి మావోయిస్టు ఉద్యమంలో శక్తి నష్టం కలిగించినా, ఉద్యమాన్ని ఆవిర్భవింపజేసిన అసమానతలు, ఆదివాసీల దుస్థితి, సామాజిక అన్యాయ వ్యవస్థ వంటి కారణాలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించే చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం పై అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

Tags

More News...

Local News 

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్                                                                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే-22(ప్రజా మంటలు)    మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.  గురువారం జిల్లాకలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...
Local News 

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 22 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే క్వార్టర్లో మున్సిపల్ అధికారులతో జగిత్యాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల పట్టణంలో వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  అభివృద్ధి పనుల పురోగతి పై చర్చించారు, వివిధ కారణాలతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి...
Read More...
Local News 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ                                           సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  మల్యాల మే 22 ( ప్రజా మంటలు)    కొండగట్టు  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 22( ప్రజా మంటలు)    భాగ్యరెడ్డి వర్మ  జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ ప్రధాన  కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  భాగ్యరెడ్డివర్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ... దళిత ఉద్యమానికి పునాదులు వేసిన ప్రముఖ...
Read More...
Local News 

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్ మే 21 (ప్రజామంటలు) : టెక్నాలజీ రంగంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి చౌరస్తాలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే...
Read More...
Local News 

క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 21(ప్రజా మంటలు)    మొదటి పది స్థానాలో జిల్లా కు రెండు స్థానాలు*  *రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న పోలీసు అధికారులు.* ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పి  అశోక్ కుమార్   ప్రజలకు, బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది...
Read More...
National  State News 

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ... ఉద్యమ కెరటం (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్...9440595494) నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భారతీయ విప్లవ రాజకీయ చరిత్రలో ఒక కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. జీవితాన్ని అజ్ఞాత రాజకీయాలకు అంకితం చేసిన ఆయన, అర్ధ శతాబ్దానికి పైగా మావోయిస్టు...
Read More...
Local News 

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్  కళాశాల ప్రారంభం

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం                                             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మేడిపల్లి మే  21 (ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో 2025 -26  సంవత్సరం నుండి నూతనంగా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం నకు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్బుధవారం రోజున జగిత్యాల జిల్లా మేడిపల్లి...
Read More...
Local News 

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 20 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక ధారుడ్యం స్నేహ భావానికి దోహదపడతాయన్నారు. విద్య తో పాటు క్రీడలు ముఖ్యమేనన్నారు.   పట్టణంలో ఒక్కో జిమ్ 14లక్షలతో పట్టణ నలు వైపులా ఏర్పాటు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు తో నాణ్యమైన శిక్షణ,వసతులు...
Read More...
Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.    జగిత్యాల మే 20 (ప్రజా మంటలు)   హనుమాన్ పెద్ద జయంతి కి 800 మంది సిబ్బందితో పటిష్ట భద్రత సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ   -జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల మే 20 )ప్రజా మంటలు)కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన  వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.పార్టీ కార్యాలయం లో  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన  వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని,...
Read More...
Local News  State News 

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 20 మే (ప్రజా మంటలు) :  కేసీఆర్‌ కు రాజ‌కీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ...  చావునోట్లో...
Read More...