దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే _బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్_
జగిత్యాల, ఏప్రిల్ 20(ప్రజా మంటలు)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తే నరేంద్ర మోడీ తలదించుకుని వచ్చారని ఆయన స్థానంలో నెహ్రూ ఉంటే ఆ పని చేసేవాడు కాదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని భారత సమాజానికి రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ డిమాండ్ చేశారు.
ఆదివారం జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడడం రాహుల్ కు అలవాటేనని గతంలో కూడా విదేశీ గడ్డపై ఎన్నో సార్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి భారతదేశంలో ఎవరికి రక్షణ లేదని హిందూ దేవిదేవతలు హింసావాదులని అందుకే వారి చేతుల్లో మారణాయుధాలైన శంఖు, చక్రం, గదా, త్రిషూలం లాంటి ఆయుధాలు ఉంటాయని మాట్లాడి పరువు తీశారన్నారు. నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై అంటాడు అని అసలు భరతమాత అంటే ఎవరు అసలు భారతమాత ఉందా అని ప్రశ్నించిన రాజకీయ అజ్ఞాని రాహుల్ అని అన్నారు. భారతమాత అంటే ఎవరని నూట నలభై కోట్ల ప్రజానీకాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ సోనియా గాంధీని అవమానించినట్టేనని అన్నారు. రాహుల్ గాంధీకి మన విదేశాంగ విధానంపై దేశ చరిత్రపై ఎలాంటి అవగాహన లేదని ట్రంపు మోడీని సంబోధిస్తూ ప్రపంచ వేదికపై మోది మా పెద్దన్న అని మాట్లాడిన వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై కొంతమంది దేశాధ్యక్షులు నరేంద్ర మోడీకి పాదాభివందనం చేసిన విషయం రాహుల్ గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు సోవియట్ చైనాతో అంటకాగడం వల్లే అమెరికా భారత్ కు దూరమై పాకిస్తాన్ కు అండగా నిలిచింది అన్నారు. నెహ్రూ కాలంలో చైనా టిబెట్టును ఆక్రమించుకోవడాన్ని సమర్థించి మరోవైపు దలైలామాకు భారత్లో ఆశ్రయం ఇవ్వడాన్ని ఆగ్రహించిన చైనా భారతదేశం మీద దండయాత్ర చేసి లడక్ లోని అక్సాయిచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని నెహ్రూ వైఫల్యం వల్లనే చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిపాలు అయిందని అంతేకాకుండా మన భూభాగాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మోడీ వైఫల్యం వల్లనే చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించిందని అందమైన అబద్ధాలు చెప్పుతూ దేశం పరువు తీస్తున్న రాజకీయ పరిపక్వతలేని రాజకీయ అజ్ఞాని రాహుల్ అని అందుకే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదంతో ముందుకెల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని దీనికోసం అందరం ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నలువాల తిరుపతి, జిల్లా కోశాధికారి సుంకేటి దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి బి కే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .
.jpeg)
పలు విభాగాల్లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

ధర్మపురిi దేవస్థానంలో సాంప్రదాయాలకు తిలోదకాలు... ఇష్టారాజ్యంగా చిత్రీకరణలు

దుబాయిలో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలయిన ఎల్లాపూర్ వాసి

గుర్తు తెలియని వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దేవాలయ వైశాల్యం పెంచడమే అభివృద్ధి కాదు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిగా భావించాలి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

ఘనంగా ముగిసిన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు తప్పదు *మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒకరికి నాలుగు రోజులు జైలు శిక్ష*_ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం

మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తిపై_ నాన్ బెయిలబుల్ కేసు నమోదు-పట్టణ సిఐ. వేణుగోపాల్...

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాల కోసం డయల్ యువర్ డిఎం సద్వినియోగపరచుకోండి
