ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

On
ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

ధర్మపురి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు -రామ కిష్టయ్య సంగన భట్ల) :

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  భారీ వర్షాల కారణంగా,  గోదావరి నది గణనీయంగా పెరిగింది. రెండు రోజులుగా  భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోనికి భారీగా చేరిన ఇన్ ఫ్లో గణనీయంగా పెరగగా, తదనుగుణంగా ఇన్ ఫ్లో బట్టి అవుట్ ఫ్లో కొన సాగిస్తున్నారు. కడెం నుండి 700 అడుగుల గరిష్ఠ స్థాయికి గాను, సోమవారం ఉదయం 3గంటలకు 696 అడుగుల ఎత్తుకు నీటిని స్థిరంగా ఉండేలా క్రమానుగతంగా18గేట్లను ఎత్తడం ద్వారా గరిష్టంగా 2,77,78 క్యూసెక్కుల నీటిని ఉదయం నుండి వదిలారు. కడెం వరద నీటిని గోదావరి నది లోనికి వదలడంతో, సదరు నీరు ధర్మపురికి క్రమానుగతంగా చేరి, నీటి మట్టం అనుక్షణం  పెరిగింది.

ఉదయం నడి ఒడ్డున గల శ్రీ సంతోషి మాతా ఆలయం ప్రధాన ఉత్తర ద్వారం దాటి వరదలు పైకి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఎప్పటి కప్పుడు నీటి ఉధృతి సమాచారాన్ని అందుకుంటూ అధికారులను అప్రమత్తం చేశారు. సాయంత్రం  ధర్మపురిలోని మంగలి గడ్డ వద్దకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని గోదావరిని పరిశీలించి తగు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులతో సమన్యాయం కలిగి ఎప్పటి కప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశించారు.

 జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మపురి తహశీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ రాం నర్సింహా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎస్ ఐ, తమ సిబ్బందిని సమన్వయ పరిచే విధంగా ఉపక్రమించి, అనుక్షణం సమాచారాన్ని ప్రాజెక్టుల అధికారుల ద్వారా తెలుసుకుని, ఉన్నతా ధికారులకు సమాచారం అందిస్తూ, గోదావరి నది ఒడ్డున మకాం వేసి, దేవస్థానం పక్షాన మైకులలో ప్రకటింప చేస్తూ, తీరవాసులను అప్రమత్తం చేసే చర్యలు గైకొన్నారు. రెవెన్యూ అధికారులు గోదావరి తీరాన గల సంతోషి మాత ఆలయం లోనికి నీరు చేరగా, భక్తుల స్నానాలను నిలిపి వేసి, నది ప్రవాహం వద్దకు ఎవరినీ వెళ్లనీయ కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టు నుండి వదులున్న నీటిని క్రమంగా తగ్గించిన క్రమంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 అలాగే శ్రీరాం సాగర్  ప్రాజెక్టు నుండి అదే క్రమంలో అధిక వరద నీటిని గోదావరి లోనికి వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరా సాగర్ ప్రాజెక్టుకు భారీగా చేరిన ఇన్ ఫ్లో బట్టి 1091 అడుగుల ఎత్తుకు గాను 1088.5 అడుగుల ఎత్తును సరిచూసుకుని, ఉదయం 11.40కి 1లక్ష క్యూసెక్కుల నీటిని వదిలి క్రమేపీ సాయంత్రం 5గంటలకు 40 గేట్ల ద్వారా 2లక్షల  నుండి గరిష్టంగా 2,50,000  క్యూసెక్కుల నీటిని గోదావరి లోనికి వదిలారు. రాత్రి వరకు సదరు నీరు ధర్మపురి క్షేత్రం ప్రాంతానికి చేరుకొనున్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

Tags

More News...

National  International  

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ ఆందోళనలో ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలు న్యూ ఢిల్లీ జూలై 30: సుంకాల ఆందోళనలపై రూపాయి విలువ 87/USD కంటే తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే అవకాశం ఉందిభారత ఎగుమతులపై అమెరికా అధిక సుంకాల రేటు విధించే అవకాశం ఉందనే ఆందోళనలతో భారత రూపాయి బుధవారం మార్చి మధ్యకాలం నుండి దాని బలహీన స్థాయికి...
Read More...
Local News 

వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

వానాకాలం  స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్.. పద్మారావునగర్ పార్కులో దోమల వ్యాప్తిపై అవేర్నెస్   సికింద్రాబాద్, జూలై 30 (ప్రజామంటలు): దోమల వ్యాప్తి, కాటు వలన కలుగు ఆనారోగ్య సమస్యలు, దోమల నివారణ అంశాలపై పద్మారావునగర్ పార్కులో వాకర్స్ కు జీహెచ్ఎమ్సీ ఎంటమాలజీ సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం...
Read More...
Local News 

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో, మున్సిపాలిటి అనేది ఒకటి ఉన్నదని ప్రజలు మర్చిపోయే పరిస్థితి, జగిత్యాల మున్సిపాలిటీలో కమీషనర్, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆఫీసులో మూమెంట్ రిజిష్టర్ ఎక్కడుందో తెలియదని,. ఉన్న దాంట్లో...
Read More...
Local News 

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు): జాతీయ లీగల్ సెల్ ఆధ్వర్యంలో, దేశంలో మారుతున్న రాజ్యాంగ విలువలు, వాటిపై జరుగుతున్నా దాడి, రాజ్యాంగం  పరిరక్షణ,  ఏ విధంగా దేశ ప్రజలకు న్యాయం జరగాలనే దానిపై ఆగస్టు 2 న ఢిల్లీలో జరిగే న్యాయవాదుల సదస్సుకు, జగిత్యాలలో నిజామాబాదు లీగల్ సెల్  కోఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్ టీపీసీసీ...
Read More...
Local News  State News 

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారుల జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని రోడ్లుభవనాల శాఖలో పనిచేస్తున్న సీ అనీల్ కుమార్ కాంట్రాక్టర్ నుండి 7 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం చేసిన...
Read More...
Local News 

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు  నగదు రివార్డు ప్రకటించి, జిల్లా పోలీసులకు అభినందించిన  తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య  జగిత్యాల జులై 30 (ప్రజా మంటలు) గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీస్ చేపట్టిన చర్యలు, గంజాయి రవాణాదారులపై నిర్వహించిన ఆకస్మిక దాడులు, వారి అరెస్టులు మరియు మాదకద్రవ్యాల స్వాధీనం లో కఠిన చర్యలు తీసుకున్న  జిల్లా...
Read More...
Local News 

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్      గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలిజగిత్యాల జులై 30 (ప్రజా మంటలు)రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు*హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జిల్లా పోలీస్...
Read More...
Local News 

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి     జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు)   జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి  రాజ్ కుమార్ ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ2024 - 25  విద్యా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్ జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు)రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్… కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందం… మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న AEE… మిగతా 7...
Read More...
Local News 

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం      ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు * భీమారం జులై 30 (ప్రజా మంటలు)త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...