ఎరువుల విక్రయాలను ఖచ్చితంగా నమోదు చేయాలి రైతులకు అవసరమైన సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయి జిల్లా కలెక్టర్.
కథలాపూర్ /మేడిపల్లి ఆగస్టు 12 (ప్రజా మంటలు)
యూరియా విక్రయాలను పరిశీలించారు రైతులకు పంట వెస్తీర్ణం ఆధారంగా యూరియాను.పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్.
కథలాపూర్ మండలం భూషణ్ రావుపేట్ మరియు సిరికొండ గ్రామంలో మరియు
మేడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
మంగళవారం రోజున కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట్ సిరికొండ గ్రామాలలో మరియు మేడిపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరాపై ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా రైతులకు సంబంధించిన భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది, ఎంత సరఫరా చేసాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోగలరని అధికారులను కలెక్టర్ ఆదేశించించారు.
రైతులకు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జి వాకర్ రెడ్డి, తహసిల్దార్ లు ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
