స్వాతంత్రదినోత్సవం సందర్భంగా డాగ్ స్క్వాడ్, బి డి టీమ్ ప్రత్యేక తనిఖీలు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
జగిత్యాల ఆగస్టు 12 (ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ఈ క్రమంలో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల మెట్ పల్లి లో ప్రధాన ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రజా రవాణా కేంద్రాలు, సమావేశ ప్రాంగణాలు, ముఖ్య రహదారులు, వంతెనలు మరియు పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అనుమానాస్పద వాహనాలు, సంచులు, పార్సెల్లు, వదిలివేసిన ప్యాకేజీలు మరియు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి ప్రాంతాన్ని సిస్టమేటిక్గా తనిఖీ చేసి,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతోంది. ప్రజలు కూడా అపరిచిత వస్తువులు లేదా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా 100 నంబర్ కి సమాచారం ఇవ్వాలి అని ఎస్పి అని సూచించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, భద్రత గా జరిగేందుకు పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
