డిపివో "చీకోటి మదన్ మోహన్ పై" చర్యలు తీసుకోండి - జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన బుగ్గారం వాసులు
అవినీతికి పాల్పడి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదని ఆరోపణ...?
లోకాయుక్త తీర్పు, జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలను భే ఖాతర్ చేశారని ఆవేదన
చట్టాలను ఉల్లంఘిస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు
విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న డిపివో మదన్ మోహన్...??
బుగ్గారం ఆగస్టు 11 (ప్రజా మంటలు):
చట్టాలను ఉల్లంఘిస్తూ, లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాల ఉత్తర్వులను కూడా భే ఖాతర్ చేస్తూ, అత్యంత విలువైన తన విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి "చీకోటి మదన్ మోహన్ పై" చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా వాణి లో జిల్లా కలెక్టర్ కు బుగ్గారం వాసులు పిర్యాదు చేశారు.
గత ఎనిమిది నెలల నుండి బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు, విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి కోర్ కమిటి వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న లు ఆరోపించారు. లోకాయుక్తతో పాటు జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాలు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆర్డర్లను కూడా తుంగలో త్రొక్కారని వారు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన అనేక ఉత్తర్వులను, సమాచార హక్కు చట్టం దరఖాస్తులను, అప్పీల్లను ఇతర పిర్యాదులను సైతం బుట్ట దాఖలు చేసి పట్టించుకోవడం లేదన్నారు. బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ దోషులతో కుమ్మక్కై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ దోషుల ద్వారా అవినీతికి పాల్పడి తన విధులను, అత్యంత విలువైన బాధ్యతలను విస్మరిస్తున్నారని పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
అవినీతి - అక్రమాలతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిపివో చీకోటి మదన్ మోహన్ పై 25 సందర్భంలను తెలియ పరుస్తూ చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
