రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు

On
రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు

 వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, క‌వాసాకి డిసీజ్‌లు వ‌చ్చే ప్రమాదం
 వీటిని జాగ్రత్తగా గ‌మ‌నించి స‌త్వర చికిత్సలు అందించాలి
  లేనిప‌క్షంలో ప్రాణాల‌కే ప్రమాదం వాటిల్లే అవ‌కాశం
  ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణుడు ప్రొఫెస‌ర్‌ సుర్జీత్ సింగ్‌
 
సికింద్రాబాద్, ఆగస్ట్ 10 (ప్రజామంటలు) :

సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో ఉండే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌య‌టి నుంచి వ‌చ్చే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. కానీ, అది బాగా ఎక్కువైతే.. మ‌న సొంత శ‌రీర అవ‌య‌వాల‌నే శ‌త్రువులుగా భావించి వాటి మీద దాడి చేస్తుంది. అప్పుడు ఆ అవ‌య‌వాలు క్రమంగా క్షీణిస్తాయని  ప్రపంచ ప్రఖ్యాత పీడియాట్రిక్ రుమ‌టాల‌జిస్ట్, ఇమ్యునాల‌జిస్ట్, చండీగ‌ఢ్‌లోని పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెస‌ర్ సుర్జీత్ సింగ్ తెలిపారు.

ఆదివారం న‌గ‌రంలోని సికింద్రాబాద్ కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమ‌టాల‌జీపై జరిగిన స‌దస్సులో పాల్గొని కీల‌క ప్రసంగం చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ....దీనివ‌ల్ల వ‌చ్చే వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, క‌వాసాకి డిసీజ్ లాంటివి అత్యంత ప్రమాద‌క‌రం. దుర‌దృష్టక‌ర‌మైన విష‌యం ఏంటంటే, పిల్లల‌కు కూడా ఇవి సోకేందుకు చాలా అవ‌కాశం ఉంటుంది. వాళ్ల విష‌యంలో త‌ల్లిదండ్రులు అత్యంత అప్రమ‌త్తంగా ఉండాలి. త‌ర‌చు జ్వరం, ఒంటిమీద ద‌ద్దుర్లు, ద‌గ్గు, జ‌లుబు లాంటివి వ‌స్తుంటే వెంట‌నే జాగ్రత్తప‌డి ఇమ్యునాల‌జీ నిపుణుల వ‌ద్దకు తీసుకెళ్లాలి. లేనిప‌క్షంలో పిల్లల‌కు ప్రాణాపాయం సంభ‌వించే ప్రమాదం సైతం ఉందన్నారు.

ఐదేళ్లలోపు పిల్లల‌కు గుండె ర‌క్తనాళాల్లో వాపు వ‌చ్చి, గుండె వైఫ‌ల్యం సంభ‌వించే అత్యంత ప్రమాద‌క‌ర‌మైన క‌వాసాకి డిసీజ్ అనే వ్యాధి వ‌చ్చిన వారిలో ఇప్పటివ‌ర‌కు వెయ్యి మందికి పైగా పిల్లల‌కు చికిత్స చేసి, వారి ప్రాణాల‌ను కాపాడిన చ‌రిత్ర ఉన్న ప్రొఫెస‌ర్ సుర్జీత్ సింగ్‌.. ఈ స‌ద‌స్సును కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర‌రావు, చీఫ్ నియోనాటాల‌జిస్ట్, క్లినిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్. మ‌దార్కర్‌, పీడియాట్రిక్ ఇమ్యునాల‌జీ, రుమ‌టాల‌జీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అబ‌ర్ణా తంగ‌రాజ్, పీడియాట్రిక్స్ విభాగం క్లినిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ ప‌రాగ్ శంక‌ర్‌రావు డెకాటే, ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 400 మందికి పైగా వైద్యులు హాజ‌రైన ఈ స‌ద‌స్సులో ప్రధానంగా పిల్లల‌కు వ‌చ్చే ప‌లు ర‌కాల స‌మస్యలు, ముఖ్యంగా రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ కావ‌డం, త‌క్కువ కావ‌డం వ‌ల్ల వ‌చ్చే స‌మస్యల‌పై కూలంక‌షంగా చ‌ర్చించి, స‌మ‌గ్ర వివ‌రాలు తెలిపారు. 

స‌ద‌స్సులో కిమ్స్ ఆస్పత్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రుమ‌టాల‌జీ అండ్ క్లినిక‌ల్ ఇమ్యునాల‌జీ విభాగం క్లినిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ వీర‌వ‌ల్లి శ‌ర‌త్ చంద్రమౌళి మాట్లాడుతూ, పిల్లల‌కు ఏడాది వ‌య‌సు ఉన్నప్పటి నుంచి సాధార‌ణంగా 15 ఏళ్ల లోపు వ‌ర‌కు ఇలాంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. వీటి ల‌క్షణాలు తొలుత సాధార‌ణంగానే అనిపిస్తాయి. మామూలు జ్వరం రావ‌డం, ఒంటి మీద ద‌ద్దుర్లు, ద‌గ్గు, జ‌లుబు లాంటివి ప‌దే ప‌దే వ‌స్తుంటాయి. వీటిని మామూలు ల‌క్షణాలు అనుకుని వాటికి మాత్రమే చికిత్స చేయిస్తూ వ‌దిలేస్తే చాలా ప్రమాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తుంది. అందువ‌ల్ల పిల్లల వైద్యులు, జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్లు కూడా దీనిపై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. పిల్లల‌ను త‌ల్లిదండ్రులు ఇలాంటి ల‌క్షణాల‌తో తీసుకొచ్చిన‌ప్పుడు వెంట‌నే పీడియాట్రిక్ క్లినిక‌ల్ ఇమ్యునాల‌జిస్టులు, రుమ‌టాల‌జిస్టుల వ‌ద్దకు పంపాలి. అప్పుడే త‌గిన ప‌రీక్షల ద్వారా అస‌లు స‌మ‌స్య ఏంట‌న్నది గుర్తించి, దానికి వెంట‌నే చికిత్స ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది.

వీటిలో కొన్నింటికి దీర్ఘకాలం పాటు .. అంటే కొన్ని వారాల త‌ర‌బ‌డి చికిత్స చేయాల్సి రావ‌చ్చు. ఒక్కో ర‌కం స‌మ‌స్యకు ఒక్కో త‌ర‌హా ఇమ్యునో స‌ప్రెసెంట్లు, ఇత‌ర మందులు వాడాల్సి ఉంటుంది అని తెలిపారు.

పీడియాట్రిక్ అకాడ‌మీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (పాట్స్), ఇండియ‌న్ అకాడ‌మీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) జంట‌న‌గ‌రాల శాఖ‌, లిటిల్ వ‌న్స్ క్యూర్ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో కిమ్స్ కడ‌ల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స‌ద‌స్సులో కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్పత్రిలో సీనియ‌ర్ క‌న్సల్టెంట్ నియోనాటాల‌జిస్ట్, పీడియాట్రీషియ‌న్ డాక్టర్ అప‌ర్ణ సి, ఇంకా డాక్టర్ కె.వి. అనిల్ కుమార్, డాక్టర్ గుమ్మడి అంజ‌ని, డాక్టర్ అబ‌ర్ణా తంగ‌రాజ్, డాక్టర్ జాస్తి శ్రీ‌రేఖ‌, డాక్టర్ సంబిత్ సాహు, డాక్టర్ పి. రాకేష్ కుమార్  పాల్గొన్నారు.
–ఫొటో

Tags

More News...

Local News 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక  ధర్మపురి ఆగస్టు 13 (ప్రజా మంటలు): ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మధు మహాదేవ్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషన్  ఎన్నికయ్యారు. స్థానిక కర్నె అక్కపెళ్లి కళ్యాణమండపంలో  రాష్ట్ర నాయకులు జె.సురేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సంగనభట్ల రామకృష్ణయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలచారి,ఆధ్వర్యంలో ఐ జే యు జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటీ...
Read More...
National  State News 

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు పాట్నా ఆగస్ట్ 12:మంగళవారం (ఆగస్టు 12, 2025)న విడుదల చేసిన ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, కొత్తగా ఓటర్ల నమోదు కోసం దాదాపు 64,000 దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. బీహార్ SIR: కొత్తగా దరఖాస్తులు దాఖలు చేస్తున్న ఓటర్లు డ్రాఫ్ట్ రోల్స్‌లో లేరా లేదా మొదటిసారి ఓటర్లా అనేది EC డేటా అస్పష్టంగా ఉంది...
Read More...
Local News 

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి సికింద్రాబాద్, ఆగస్టు 12 (ప్రజామంటలు): రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్బంగా రాష్ర్ట బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు మర్రి పురూరవరెడ్డికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తార్నాక లోని ఆయన నివాసంలో మర్రి పురూరవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.రాంచంద్రరావు...
Read More...
National  Local News  State News 

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్,  ఆగస్టు 12 (ప్రజా మంటలు)::ట్రాఫిక్ పోలీసులు మరొక చెట్టుకు పునర్జన్మ ఇచ్చారు. మహాంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్నీ జంక్షన్ సమీపంలో  ఉన్న ఓ పెల్టో ఫోరం చెట్టు కు సంబందించి విస్తరించిన కొమ్మల కారణంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్...
Read More...

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025  విద్యా సంవత్సరానికి గాను నిర్వహించబడే డిప్లమా  ఇన్ మ్యాజిక్ కోర్సులో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని వర్సిటి రిజిస్ర్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు , ఔత్సహిక కళాకారులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని సంబంధిత శాఖలో సమర్పించి నేరుగా...
Read More...
National  Local News  State News 

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్ *డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) : సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి...
Read More...
Local News  State News 

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ శస్త్రచికిత్స లేకుండా  ప్రోస్టేట్ క్యాన్సర్‌, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :  తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా...
Read More...
State News 

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్ హైదరాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : మిసెస్ క్రియేటీవ్–2019 మిసెస్ లావణ్య అదారి తన కలల డిజైనర్ బోటిక్ షాపును మంగళవారం సిటీలోని అత్తాపూర్ లో విజయవంతంగా లాంచ్ చేశారు. మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో పేరుతో ప్రాంభించిన బోటిక్ లో బ్రైడల్ కు సంబందించిన ఫ్యాషన్ దుస్తులు, చిక్ వెస్ర్టన్ ఔట్ ఫిట్స్,...
Read More...
Local News 

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం   ఇబ్రహీంపట్నం ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ 33/11కేవీ సబ్స్టేషన్ లో సామర్థ్యానికి మించి లోడు నమోదు అవుతున్న దృష్ట్యా రూ.85 లక్షలతో అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కావడం, మూడు రోజుల క్రితం సబ్స్టేషన్ కు  పంపించారు....
Read More...
Local News  State News 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు  హైదరాబాద్ ఆగస్ట్ 12: కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి రూ.15 వేల రూపాయలు సుజాత డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుని తీసుకుంటుండగా పట్టుకొన్నారు.
Read More...
State News 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి  అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 12: గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో...
Read More...
National  State News 

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 12:   'నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు, లక్నో మెట్రో విస్తరణ', ₹18541 కోట్ల విలువైన ప్రణాళికలను కేబినెట్ ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించారు. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్...
Read More...