వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

On
వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

 దేశ విదేశాల్లో సంప్రదాయ ఆచరణలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)

గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధ వచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరుల వారు తన భాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రంలో యిరువది నాలుగు అక్షరములతో పాటు యిరువది నాలుగు దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా నుండును. ఈ యిరువది నాలుగు గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అనిపేరు. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.

 

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతి వారికీ సుపరిచితమైంది 'యజ్ఞోపవీతం'. దీనినే తెలుగులో 'జంధ్యం' అంటాం. ... యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని 'యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...' అనే మంత్రం చెబుతోంది. సనాతన వైదిక సాంప్రదాయాల ఆచరణ అనురక్తి పరులు అనాదిగా ఏటా యజ్ఞోపవీత ధారణ చేయడం పరిపాటి. 


 శ్రావణ పూర్ణిమ సందర్భంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు సాంప్రదాయ బద్దంగా, కన్నుల పండువగా జరిగాయి. దేశ విదేశాలలో సామూహిక కార్యక్రమాలలో భాగస్వాములు అయినారు. ఆచార్యుల ఆచార్యత్వంలో వేదోక్త సాంప్రదా యరీతిలో సామూహిక పూజలు, విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాశనం,  బ్రహ్మయజ్ఞం, నవకాండ రుషుల పూజ, అగ్నిప్రతిష్ఠ, నవకాండ రుషుల హోమం, చతుర్వేద హోమం, నూతన యజ్ఞోపవీత ధారణం, జయాది హోమాలు, వైశ్వానర పూజ, మంత్ర పుష్పం,  ఆశీర్వచనం, రక్షాధారణాది క్రతువు లు నిర్వహించారు. 

IMG-20250809-WA0014
ప్రజాపతితో ఆవిర్భవించిన యజ్ఞోపవీతం ఆయు, బలం, తేజస్సు, శ్రేష్ఠత్వాలను, నిర్మలత్వాన్ని కలిగిస్తుందని, త్రివిధ రుణాల ప్రతీకలైన దేవ రుణం, పితృరుణం, రుషి రుణాలను పంచమహా యజ్ఞం ద్వారా శరీరంతో తీర్చుకోవడం ధర్మ మని, అదే ఉపాకర్మ ఉద్దేశమని పౌరోహిత్య, జ్యోతిష పండితులు వివరించారు.
రాఖీ పూర్ణిమ  పురస్కరించుకుని క్షేత్రంలో - రక్షాబంధన కార్యక్రమాలలో భాగస్వాములై, ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకున్నారు. ప్రాచీన ఆర్షవిజ్ఞానానికి, సనాతన సాంప్రదా యలకు అనాదిగా నెలవు ధర్మపురి క్షేత్రం. పరమత ద్వేషుల కరవాలా ఘాతాలకు గాయపడి, ఎదురొడ్డి, స ముద్ర వీచికల వలె ఎగిరిపడి, తిరిగి సర్దుకుని, చరిత్రకు అందనంత పూర్వకాలికంగా అనాదిగా ఉజ్జ్వల సాంస్కృతిక, వైదిక, తాత్విక, పౌరాణిక పుణ్య భూమిగా విలసిల్లుతున్నదీ గోదావరీ తీరస్థ తీర్ధ క్షేత్రం. 3వేల ఏళ్ళ చరిత్ర కలిగి, మునులకు, రుషులకు, యజ్ఞయాగాది క్రతువుల కు కేంద్ర స్థానమై నిలిచింది. 500కు పైగా గడపలు కలిగిన విప్ర గృహాలకు చెందిన వారు తమ సంస్కృతిని, జీవన విధానాన్ని, శతాబ్దులుగా మారనీయకుండా ఉంచడాన్ని బట్టి, వైదిక సంప్రదాయ రక్షణ ఎలా చేస్తు న్నారో స్పష్టమవుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమెరికాలోని పలు ప్రాంతాలు, ముంబై, హైదరా బాద్ లాంటి చోట్ల సామూహిక యజ్ఞోపవీత ధారణలు చేయడం సనాతన సంప్రదాయ ఆచరణగా మారింది.

Tags

More News...

National  State News 

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు

CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు న్యూఢిల్లీ ఆగస్టు 10: CBSE తీసుకున్న పెద్ద నిర్ణయం వల్ల, ఇప్పుడు 9వ తరగతి విద్యార్థులు ఓపెన్ బుక్ తో పరీక్ష రాయగలరు;CBSE తదుపరి విద్యా సంవత్సరం 2026-27 నుండి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఓపెన్ బుక్ అసెస్‌మెంట్ (OBA) పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద, విద్యార్థులు భాష, గణితం, సైన్స్...
Read More...
Local News  State News 

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల ఆగస్టు 10 (ప్రజా మంటలు):   జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, బీసీ లను...
Read More...
Local News  State News 

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కి కరప్షన్ గనిగా మారిన సింగరేణి - దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత చర్చలు హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది సింగరేణి కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి తెలంగాణ జాగృతి...
Read More...
Local News 

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్, ఆగస్టు 10 (ప్రజా మంటలు):  చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని మెట్టుగూడ వద్ద గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెట్టుగూడ మెట్రో పిల్లర్ నంబర్ 1084 వద్ద గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 55- 60) డెడ్‌బాడీ పడి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు వెళ్లి...
Read More...
Local News  State News 

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు

రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువైతే పిల్లల‌కు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై స‌ద‌స్సు   వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, క‌వాసాకి డిసీజ్‌లు వ‌చ్చే ప్రమాదం  వీటిని జాగ్రత్తగా గ‌మ‌నించి స‌త్వర చికిత్సలు అందించాలి    లేనిప‌క్షంలో ప్రాణాల‌కే ప్రమాదం వాటిల్లే అవ‌కాశం    ప్రపంచ ప్రఖ్యాత వైద్యనిపుణుడు ప్రొఫెస‌ర్‌ సుర్జీత్ సింగ్‌  సికింద్రాబాద్, ఆగస్ట్ 10 (ప్రజామంటలు) : సాధార‌ణంగా మ‌న శ‌రీరంలో ఉండే రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌య‌టి నుంచి వ‌చ్చే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది....
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు సికింద్రాబాద్  ఆగస్టు 10 (ప్రజా మంటలు): సిటీలోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్ లపై దుర్భర జీవనం గడుపుతున్న అనాధలకు, నిరాశ్రయులకు మేము ఉన్నాము.. అని స్కై ఫౌండేషన్ ఆర్గనైజర్లు అండగా నిలిచారు. రక్షాబంధన్ పండుగ వేడుకల సందర్భంగా అందరూ వేడుకలు చేసుకుంటుంటే అనాధల వద్దకు వెళ్లిన వీరు మీకు మేము  ఉన్నామని అంటూ...
Read More...
National  International  

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు అదే దారిలో ఇండియా,కెనడా దేశాలు మాడ్రిడ్ ఆగస్ట్ 09: F-35 విమానాలను స్పెయిన్ తిరస్కరించింది, US జెట్ ఒప్పందం నీరుగారిపోయింది, ట్రంప్ కలలు చెదిరిపోయాయి. గతంలో అమెరికాతో ఎఫ్ 35 జెట్ ఫైటర్ విమానాల కొనుగోలో ఒప్పందంను స్పెయిన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.అమెరికా నుండి F-35 కొనుగోలును కెనడా పునరాలోచించుకుంటోంది స్పెయిన్ చర్య ఇతర దేశాల ప్రాధాన్యతలు...
Read More...
National  Local News  State News 

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం న్యూఢిల్లీ ఆగస్ట్ 09: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలిలో, ఆగస్టు 5, 2025 మంగళవారం, రోజున కురిసిన వర్షానికి,  మేఘావృతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది; విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శనివారం నాటికి హెలికాప్టర్లను ఉపయోగించి 825...
Read More...
Local News  State News 

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :   రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్  స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు వారికి...
Read More...
Local News  Spiritual   State News 

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరిసికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):   రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి  క్షీణిస్తున్న ప్రస్తుత  రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం వివరాలు...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం     మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు) రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న...
Read More...
Local News 

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు.  దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన .  జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు) పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి  దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు...
Read More...