హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు)
వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం స్పష్టం చేశారు .
హెచ్ టి. 11 KV , 33 KV, ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు .
ఇందులో భాగంగా 11 KV వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏ.డి.ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని, అలాగే 33 KV వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి.ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు .
ఈ సింగిల్ విండో కొత్త విధానం వలన మొదట వినియోగదారులు TGNPDCL పోర్టల్లో అవసరమైన పత్రాలతో HT దరఖాస్తులు( టీజీ ఐపాస్ లో నమోదు కానటువంటివి) నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (UID) ఉత్పన్నమవుతుంది . అలా వచ్చిన కొత్త దరఖాస్తులు TGNPDCL యొక్క సంబంధిత సర్కిల్లలో డాష్ బోర్డులో కనిపిస్తుంది. ప్రతిరోజూ ADE/కమర్షియల్ అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తూ ఉంటారు..
దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11KV , 33 KV ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని , ADE/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్ను సందర్శిస్తారు. 33 KV మరియు ఆ పై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారు.
ఇక 33KV ఆ పై వోల్టేజి దరఖాస్తులు అయితే, ఆన్లైన్లో సంబంధిత CE/కమర్షియల్ & RAC/TGTRANSCO హైదరాబాద్ కి ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుంది .
11KV వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్లోడ్ చేయబడుతుంది. వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు ఆ సూచనలు వినియోగదారునికి SMS రూపేణా పంపబడుతుంది. అలాగే 33 కె వి,ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు .
సింగిల్ విండో వ్యవస్థ వలన త్వరిత గతిన సర్వీసులు మంజూరు అవుతాయని, ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు . దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు ఎస్ ఏం ఎస్ రూపేణా సమాచారం పంపబడుతుందని వివరించారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
