పెన్షన్ సమస్యల పరిష్కారంకు సంఘటితంగా ఉద్యమిస్తాం -టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరిఆశోక్ కుమార్.
జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు):
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘటితముగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా సంఘ కార్యాలయంలో " పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ" అనే విషయంలో తమ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం నుసమర్పించామన్నారు.
ఈ సందర్భంగా టీ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పెన్షనర్స్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలన్నారు.తెలంగాణ ఉద్యమంలోపాల్గొన్న పెన్షనర్లకు ఉద్యోగుల కు ఇచ్చినట్లుగా ప్రోత్సాహక ఇంక్రిమెంట్ ప్రకటించాలన్నారు.ఏప్రిల్ 2024 తర్వాత రిటైర్మెంట్ అయినవారికీ పెన్షనరీ ప్రయోజనాలు సత్వరం చెల్లించాలన్నారు.
పెండింగ్ డి.ఏ.లు ఇవ్వాలని,మెరుగైన పీ అర్ ప్రకటించాలని,రూ.398 వేతనం తో నియమించబడ్డ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నగదు రహిత వైద్య చికిత్స కోసం ఈ.హెచ్.ఎస్.ను వెంటనే అమలు చేయాలి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కోరామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం , అసోసియేట్ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కొయ్యడ సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్ మోహన్,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు,మల్యాల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్, రాయికల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు,జిల్లా, మండల యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
