నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

On
నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

 
రాయికల్ జూలై28 (ప్రజా మంటలు)
హిందూ సాంప్రదాయంలో 
శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజును నాగ పంచమి అంటారు.
మంగళవారం నాగుల పంచమి సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ నాగుల పంచమి విశిష్టతను వివరించారు.
బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజును నాగ పంచమిగా వ్యవహరిస్తారని అన్నారు.
కార్తీక మాసం లో వచ్చే''నాగులచవితి'' మాదిరిగానే  శ్రావణ మాసంలో నాగ పంచమి నాడు హిందూ మహిళలు బాలికలు నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా , అన్నీ సవ్యంగా నెరవేరుతాయని , పరిస్థితులు అనుకూలిస్తాయని, నాగదోషం తొలగిపోతుందని హిందువులు విశ్వసిస్తారని ఆయన అన్నారు.

చలి చీమ నుండి  చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు - చేమ , వాగు - వరద , నీరు - నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.

పురాణాల ప్రకారం  
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు , తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు.
దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై  మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు .

విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభక్షకులై సాదుజీవులు గా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళ లలో నివాసం చేయండి"* అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.

దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు 
వైదిక కాలం నుండి శ్రావణ మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం భారత దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారని ఆయన అన్నారు.

పూర్వకాలంలో 
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలలో నాగుల పంచమి ప్రాముఖ్యత ను తెలిపారు.  శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగ పంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి , కర్రతోగానీ , లేదా మట్టితోగానీ వారి వారి శక్త్యానుసారం భక్తి భావము తో ఐదు పడగల పాము ప్రతిమను చేయించాలి. లేదంటే పసుపు , చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి , సంపెంగ , సన్నజాజి ,మల్లె,గన్నేరు తదితర పుష్పాలతో పూజించాలి. పాయసము , పాలు నివేదన చేయాలని అన్నారు 

గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి , ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప , పూజగదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ , పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక  ఉత్తముడైన బ్రాహ్మణులకు తాంబూలం , పానకం, వడపప్పులతో సహా  నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని
పాపాల నుంచి విముక్తి లభించడం , సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయని
 పురాణాలు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 

పాములను పూజించడం వెనుక సామాజిక మైన హితవు ఉన్నది . యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి., పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు.  ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి.  

స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు.  హిందూ సంస్కృతిలో  పాముని చంపడం పాపంగా భావిస్తారు.  పాముని చంపినా , పాము మృతదేహాన్ని చూసిన దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. 

కాలసర్ప దోషం ఉన్నవారు , ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.  నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి  పూజలు చేయడం వలన  దోష నివారణ జరిగి , సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.

Tags

More News...

Local News 

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి  బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు) పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.       మంగళవారం  రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల...
Read More...
Local News 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ  జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు) వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి  సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి   సింగిల్  విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని   జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం   స్పష్టం చేశారు .  హెచ్ టి. 11 KV , 33 KV,...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల  జగిత్యాల 60 వసంతాల వేడుకలకు రాబోతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్    శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ....
Read More...
Local News  Crime 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత  (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు): ధర్మపురి మండలం రాయపట్నం శివారు లో  ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ ,పోలీస్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ చేస్తుండగా యువకుడు అనుమానస్పదంగా కనిపించగా, ఆ  వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత 130 గ్రాముల గంజాయి స్వాధీనం. చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు...
Read More...
Local News  Spiritual  

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు): మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు...
Read More...
Local News  Crime 

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష   5000 రూపాయల జరిమానా - నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు): ధర్మపురి  సర్కిల్ పరిదిలోని చెందిన మైనర్ బాలికను నిందితుడు సంపంగి మహేష్  27సం, వ్యక్తి ప్రేమిస్తునాని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు...
Read More...
Local News 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం 

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం    (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు):  గొల్లపల్లి మండలం లోని చిల్వకోడూరు గ్రామం లో గౌడ సొసైటీ 4,ఎకరాలభూమిలో 6000 ఈత,ఖర్జూర మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై జమీల్, ఏపీవో వేణు ,టిఏ రాజేందర్ ఎఫ్ఏ పాషా, గౌడ సొసైటీ అధ్యక్షుడు తాండ్ర చెన్నయ్య , ఎక్సైజ్...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి విద్యార్థులకు ఆహార పదార్థాలు సమయానికి అందించాలి.- మారేడ్పల్లి గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన కలెక్టర్ హరిచందన సికింద్రాబాద్, జూలై 29(ప్రజామంటలు) :   విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఉపాధ్యాయులను  ఆదేశించారు.మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లి లోని  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను  ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా
Read More...
Local News 

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట, డబ్బా,వర్షకొండ, కోమటి కొండాపూర్, ఎర్దoడి, ములరాంపూర్,బర్తిపూర్, వేములకుర్తి, యమపూర్, తిమ్మాపూర్, గోధుర్,ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి 42,04,872/- నలపై రెండు లక్షల నాలుగు వేళ ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలను, 42 కళ్యాణ లక్ష్మీ చెక్కులను గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు అందించిన...
Read More...
Local News 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం. 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.  ఇబ్రహీంపట్నం జూలై 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ ఎన్నికల్లో మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ గారు ఈసి మెంబర్ గా గెలుపొందిన సందర్బంగా ఆయనకి మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేసారు. సేవాభావంతోనే ఉన్నత పదవులు లభిస్తాయి అని మెట్ మెట్...
Read More...
Local News  Spiritual  

భక్తి  శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

భక్తి  శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి సికింద్రాబాద్, జూలై 29 (ప్రజామంటలు): నాగులపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం నాగదేవత ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఆయా ఆలయాలకు వెళ్ళిన మహిళలు అక్కడున్న నాగదేవత ఆలయాల్లోని పాముల పుట్టల వద్ద పాలు, జొన్నల ప్యాలాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. పుట్టల వద్ద కోడి గుడ్లు...
Read More...
Local News 

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం జగిత్యాల జులై 29 ( ప్రజా మంటలు)  ఇటీవల జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యూ జే ఐ జే యు) ఎన్నికలలో కోశాధికారిగా సిరిసిల్ల వేణుగోపాల్ ఎన్నికయ్యారు. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ఫోరం జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికల్లో కార్యదర్శిగా నమిలకొండ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని...
Read More...