పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

On
పెండింగ్ పనులన్నీ  సత్వరమే  పూర్తి చేయండి..

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూన్ 14:

ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నింటిని అధికారులు సత్వరమే పూర్తి చేయించాలని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అలాగే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు రైతులకు ఇటు ప్రజలకు తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

శనివారం ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లతా వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి సాగునీరు, తాగునీరు, విద్యా, వైద్యం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, సివిల్ సప్లైస్, వ్యవసాయం, సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యుత్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మంత్రి సమీక్ష నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు.. కంప్లీట్ అయిన అభివృద్ధి పనులు.. రాబోయే రోజుల్లో చేపట్టే కార్యాచరణ ప్రణాళిక.. అభివృద్ధి.. వివిధ పనులు పెండింగ్లో ఉండడానికి గల కారణాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక సూచనలు చేశారు అధికారులకు. 

సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. పెండింగ్ పనులు అన్నీ సత్వరమే పూర్తి చేయాలని, 
ఎక్కడా ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకురావాలని, పనులు పూర్తి చేయించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది 
అని స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతతో సాగునీటిపారుదల అధికారులు పూర్తి చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ధర్మపురి నియోజకవర్గంలో 95% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తారని, అటు సాగునీరు ఇటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సమీక్షలో అధికారులు తెలిపిన సమస్యలు తొందరగా పరిష్కారం మార్గాలు అన్వేషించి పరిష్కరించుకోవాలని సూచించారు. మళ్లీ వచ్చే సమావేశం వరకు వాటి పెండింగ్లో పెట్టవద్దని మంత్రి పేర్కొన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని, ఇందుకు తాను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి అధికారులతో మాట్లాడతానని తెలిపారు.IMG-20250614-WA0007 

అదేవిధంగా ఇతర సాగునీటి ప్రాజెక్టుల  నిర్మాణ పనులకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఏ ఒక్క సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు బియ్యం పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు బియ్యం నాణ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, టాయిలెట్స్, మరుగుదొడ్లు లేని చోట త్వరగా నిర్మించాలని ఆదేశించారు. వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు విత్తనాలు ఎరువులు యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ పరంగా కూడా గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

రాబోయే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.. సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రజలకు సైతం నాణ్యమైనవి అందించాలని అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు..సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి,
జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని సలహా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడుగా కంప్లీట్ చేయాలని సూచించారు. అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, అభివృద్ధి పనుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలో యాక్టివ్ గా ముందుకు సాగాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమస్యలను అధిగమించుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ధర్మపురి లో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వ నెరవేరుస్తున్నదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు సత్వరమే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు  నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ మధుసూదన్, ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి,జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

More News...

National  International  

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ ఆందోళనలో ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలు న్యూ ఢిల్లీ జూలై 30: సుంకాల ఆందోళనలపై రూపాయి విలువ 87/USD కంటే తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే అవకాశం ఉందిభారత ఎగుమతులపై అమెరికా అధిక సుంకాల రేటు విధించే అవకాశం ఉందనే ఆందోళనలతో భారత రూపాయి బుధవారం మార్చి మధ్యకాలం నుండి దాని బలహీన స్థాయికి...
Read More...
Local News 

వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

వానాకాలం  స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్.. పద్మారావునగర్ పార్కులో దోమల వ్యాప్తిపై అవేర్నెస్   సికింద్రాబాద్, జూలై 30 (ప్రజామంటలు): దోమల వ్యాప్తి, కాటు వలన కలుగు ఆనారోగ్య సమస్యలు, దోమల నివారణ అంశాలపై పద్మారావునగర్ పార్కులో వాకర్స్ కు జీహెచ్ఎమ్సీ ఎంటమాలజీ సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం...
Read More...
Local News 

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో, మున్సిపాలిటి అనేది ఒకటి ఉన్నదని ప్రజలు మర్చిపోయే పరిస్థితి, జగిత్యాల మున్సిపాలిటీలో కమీషనర్, సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆఫీసులో మూమెంట్ రిజిష్టర్ ఎక్కడుందో తెలియదని,. ఉన్న దాంట్లో...
Read More...
Local News 

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో  పోస్టల్   ఆవిష్కరణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు): జాతీయ లీగల్ సెల్ ఆధ్వర్యంలో, దేశంలో మారుతున్న రాజ్యాంగ విలువలు, వాటిపై జరుగుతున్నా దాడి, రాజ్యాంగం  పరిరక్షణ,  ఏ విధంగా దేశ ప్రజలకు న్యాయం జరగాలనే దానిపై ఆగస్టు 2 న ఢిల్లీలో జరిగే న్యాయవాదుల సదస్సుకు, జగిత్యాలలో నిజామాబాదు లీగల్ సెల్  కోఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్ టీపీసీసీ...
Read More...
Local News  State News 

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారుల జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని రోడ్లుభవనాల శాఖలో పనిచేస్తున్న సీ అనీల్ కుమార్ కాంట్రాక్టర్ నుండి 7 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం చేసిన...
Read More...
Local News 

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు  నగదు రివార్డు ప్రకటించి, జిల్లా పోలీసులకు అభినందించిన  తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య  జగిత్యాల జులై 30 (ప్రజా మంటలు) గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీస్ చేపట్టిన చర్యలు, గంజాయి రవాణాదారులపై నిర్వహించిన ఆకస్మిక దాడులు, వారి అరెస్టులు మరియు మాదకద్రవ్యాల స్వాధీనం లో కఠిన చర్యలు తీసుకున్న  జిల్లా...
Read More...
Local News 

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ  సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్      గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలిజగిత్యాల జులై 30 (ప్రజా మంటలు)రాబోవు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అధికారులు,సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు*హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జిల్లా పోలీస్...
Read More...
Local News 

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి     జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు)   జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి  రాజ్ కుమార్ ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ2024 - 25  విద్యా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్ జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు)రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్… కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందం… మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న AEE… మిగతా 7...
Read More...
Local News 

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం      ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు * భీమారం జులై 30 (ప్రజా మంటలు)త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...