కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన
కాళ్లకు హీట్ ప్యాడ్స్ పెడితే చర్మం ఊడి వచ్చింది
సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు
సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):
కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేటలో నివసిస్తున్న సంధ్య(26) అనే మహిళ ఈనెల 22వ తేదీన అంకుర్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరింది.
అదే రోజు డాక్టర్స్ సిజేరియన్ చేస్తే ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత సంధ్యను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఈమె చలి ఎక్కువగా ఉందని చెప్పటంతో రెండు కాళ్లకు సిబ్బంది హీట్ ప్యాడ్స్ కట్టారు. ఆ తర్వాత ఈ విషయం మర్చిపోయారు. అరగంట తర్వాత బాధితురాలికి మత్తు వదిలి కేకలు పెట్టటంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్లు బొబ్బలు ఎక్కి, చర్మం ఊడిపోయింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేషంట్ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది , యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
