డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి  రాష్ట్ర ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్  

On
డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి  రాష్ట్ర ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్  


జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)
డా.   బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిల వాలి అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల భావి చౌ రాస్తా సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ  జయంతి కార్యక్రమంలో   ప్రభత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   అడిషనల్  కలెక్టర్  లత  , అధికారులు  , 
పుర  ప్రముఖులు  దళిత  నాయకులు  ఆయన  విగ్రహం నకు పూల మాలలు వేసి  ఘనంగా  నివాళులు  అర్పించారు.

 ఈ సందర్బంగా  ఏర్పాటు  చేసిన సమావేశం లో  ప్రభుత్వ విప్ మాట్లాడుతూ 
డా. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతర భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన అందించిన మహనీయుడని అన్నారు.1908 ఏప్రిల్ 5న జన్మించిన ఆయన, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన అత్యంత కాలం కేబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత గల నేత మాత్రమే కాకుండా, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి గా,కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసి గ్రీన్ రివల్యూషన్‌ను సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని ఆహార ధాన్యాల పరంగా స్వయం సమృద్ధిగా మార్చిన వారని పేర్కొన్నారు.రక్షణ మంత్రిగా ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారతదేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో ఆయన నాయకత్వం విశేషమని, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో ఆయన పాత్రను మరువలేమని అన్నారు. సామాజిక  విప్లవానికి ఆయన చేసిన కృషి అపూర్వమని, డా.బి.ఆర్.అంబేద్కర్ తీరునే ఆయన కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషి సమాజానికి దిశానిర్దేశకంగా నిలిచాయని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా బాబు జగ్జీవన్ రామ్ భారత చరిత్రలో నిలిచిపోయారని అభిప్రాయపడ్డారు.
నేటి యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలాని, ఆయన ఆదర్శాలను అనుసరించాలని ఆయన అన్నారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్  లత మాట్లాడుతూ  ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని తెలిపారు.
చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ళ వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి గా పని చేశారని, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని తెలిపారు. ‌

వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.

కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మి ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్ ,డిఎస్పి రఘు చందర్ మున్సిపల్ కమిషనర్ ,రెవెన్యూ  అధికారులు , జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘ, వివిధ సంఘాల నాయకులు,  ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags

More News...

Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...
Local News 

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): SSC -2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి, మానస, సూర్య స్కూల్స్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా...
Read More...
Local News 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం మరియు జడ్.పి.హెచ్.ఎస్ గోధూర్ పాఠశాలల యందు మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో మోడల్ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా  సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ హైదరాబాద్ ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు)  మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం స్థానిక ముషీరాబాద్ లో గల భవానీ శంకర దేవాలయం వేదిక గా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 33 మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఇబ్రహీంపట్నంలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి ని పరామర్శించారు త్వరితగతిన ఈ...
Read More...
Local News 

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో అతిపురతన మహదేవుని శివలయం పున ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా నుతనం గా ఎర్పాటు చేస్తున్న ద్వజస్థంబ ఎర్పాటు కు గుడ్ల విజయ్ కుమార్- అనుష దంపతులు బుధవారం రుపాయలు 76 వేల  విరాళం...
Read More...
Local News 

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ  ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము గొల్లపల్లి ఎప్రిల్ 30 (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల కృషి వల్లే పదవ తరగతి  పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఈవో కె. రాము అన్నారు.జగిత్యాల జిల్లా 98.2 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచిన సందర్భంగా  జిల్లా విద్యాధికారి కె.రాముకిఎస్టియు టీ.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు  మచ్చ...
Read More...
Local News 

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా సికింద్రాబాద్, ఏప్రిల్ 30 ( ప్రజామంటలు): భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్ బుధవారం విడుదల అయిన పదవతరగతి వార్షిక ఫలితాల్లో విజయ కేతనం ఎగురవేశారు. రోహిత్ మిశ్రా అనే విద్యార్థి 600 మార్కులకు గాను 556 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. తర్వాత ఆర్ .నిహారిక 600 మార్కులకు గాను 533...
Read More...