అమాయకపు రైతులకు సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు కాజేసిన ముఠా అరెస్ట్ - జగిత్యాల డిఎస్పి రఘు చందర్
గొల్లపల్లి( పెగడపల్లి) ఫిబ్రవరి17 (ప్రజా మంటలు):
అమాయకపు రైతులకు సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని మోసం చేసి లక్షలు కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
పెగడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన చంద్రమౌళి బతికేపల్లి గ్రామానికి చెందిన మల్లేశం చింతకిందు కిషోర్ అనే వ్యక్తులు ముగ్గురు కలిసి NAPS అనే సంస్థ ద్వారా, రైతులకు 40% పర్సెంట్ సబ్సిడీ క్రింద ట్రాక్టర్లు ఇప్పిస్తామని బతికేపల్లి నందగిరి గ్రామంలోని ఆరుగురు అమాయకపు రైతులను నమ్మించి వారి వద్ద నుంచి దాదాపు 36 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందులో నుండి దాదాపు 10 లక్షల వరకు డౌన్ పేమెంట్ గంగాధర లోని శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి ప్రోద్బలంతో వారికి ట్రాక్టర్లు ఇప్పించి, అమాయకపు రైతులకు తెలియకుండా సబ్సిడీ కోసమని వారి సంతకాలు తీసుకొని ఈఎంఐ కట్టుకునే విధంగా పై ముగ్గురు కలిసి పథకం వేశారు.
మిగిలిన సుమారు 26 లక్షల రూపాయలను తలో కొంత మొత్తంలో తమ సొంత అవసరాలకు వాడుకొని రైతులను మోసం చేసిన మన్నె మల్లేశం చింతకింది కిషోర్ కామెర చంద్రమౌళి అను వ్యక్తులను పెగడపల్లి పోలీసులు సీఐ మల్యాల నీలం రవి ఎస్సై రవికిరణ్ లు సోమవారము పట్టుకొని జగిత్యాల కోర్టు ముందు ప్రవేశపెత్తారు. అదే గ్రామం లోని కామెర చంద్రమౌళి కి చెందిన NAPS అనే ప్రైవేట్ సంస్థపై మంచిర్యాల లో చాలామంది రైతులను మోసం చేసినందుకు గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని అదేవిధంగా పెగడపల్లి మండల ప్రాంతంలో కూడా పైన తెలిపిన విధంగా ఈఎంఐ క్రింద ఆరుగురు అమాయకపు రైతులకు ట్రాక్టర్లు ఇప్పించినట్లు మరియు వారిని మోసగించుటలో సహకరించిన శ్రీ వేంకట సాయి ఎంటర్ప్రైజెస్ జాన్ డియర్ ట్రాక్టర్ షోరూం యాజమాన్యం వారి పై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు జగిత్యాల డిఎస్పి శ్రీ రఘు చందర్ సిఐ నీలం రవి, ఎస్ఐ రవికిరణ్, తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
