శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.

On
శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జమ్మూ, కాట్రా మే 21 (ప్రజా మంటలు) : 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు జమ్ములోని (కాట్రా )ప్రాంతంలో ఈనెల 17 నుండి కొనసాగుతుండగా మంగళవారం శ్రీ గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, రుద్ర సహిత శత చండీయాగము ,మహా పూర్ణాహుతి మరియు శాంతి కళ్యాణము, కుంకుమార్చనలతో ఘనంగా ముగిశాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సేవ పరిషత్తు సభ్యులు, బాధ్యులు ,భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైదిక క్రతువులు మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి కార్యనిర్వక సభ్యులు తదితరులచే నిర్వహించబడినది. వార్షికోత్సవంలో భాగంగా సాంస్కృతిక ,సాహిత్య కార్యక్రమాలు, భజనలు, ప్రతినిత్యం స్థాపిత దేవత ఆరాధన, మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం , నిత్య హోమాలు నిర్వహించారు.

చివరి రోజైన మంగళవారం వైదిక క్రతవుల్లో భాగంగా బలి ప్రధానము, కలుషోద్వాసనము, అవబృత స్నానము, కుంభ ప్రోక్షణ, మహదాశీర్వచనము, ఆచార్య, ఋత్విక్ సన్మానము ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు దోర్భల. కృష్ణమూర్తి శర్మ, ప్రధాన కార్యదర్శి ఘనపురం. రాంప్రసాద్ శర్మ, కోశాధికారి మహాదేవభట్ల. లక్ష్మణ ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు వడిగచర్ల. విష్ణుమూర్తి శర్మ, జోషి. రమేష్, మహదేవ్ భట్ల. దిలీప్ కుమార్ శర్మ, చలివేంధ్రి. భవాని, సంయుక్త కార్యదర్శి జోషి. సత్యనారాయణరావు, రాజనాల. వెంకటేశ్వర శర్మ, యలమంచి. చంద్రశేఖర్ శర్మ, కశోజ్జుల. త్రివేణి, కార్యనిర్వాహక కార్యదర్శి సిరిసిల్ల. రాంప్రసాద్ శర్మ, వైదిక కార్యదర్శులు కొడకండ్ల. రాధాకృష్ణశర్మ, కూచి. వంశీకృష్ణ శర్మ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మదునూరి. మహాదేవ శర్మ, విఠల. మురళీధర శర్మ, శ్రవణ్ కుమారాచార్యులు, గోళ్ళ. గోవర్ధన్ శర్మ ,నిమ్మరాజు. చంద్రశేఖర్ శర్మ, దోమడాల. విశ్వనాథరావు, ముఖ్య సలహాదారులు నెమ్మాని. విష్ణుమూర్తి శర్మ, డా. తుమ్మూరి. లక్ష్మణరావు దామెర. సత్యనారాయణ శర్మ, యలమంచి విఠలేశ్వర శర్మ లు మరియు సమస్త సభ్యులు దాతల సహకారం చే వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సేవా పరిషత్ అధ్యక్షులు తెలిపారు.

Tags

More News...

Local News 

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

పద్మారావునగర్ లో సాయి సప్తాహం సికింద్రాబాద్, జూలై 05 ( ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమంలో శనివారం శ్రీ సాయి సప్తాహంలో భాగంగా భక్తులు సామూహిక సాయి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సాయి పంచముఖ ఆంజనేయ సేవ నిర్వహించారు. సాయంత్రం సద్గురు డాక్టర్...
Read More...
Local News 

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు  *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఉత్తమ డాక్టర్లకు మెడికల్  ఎక్సలెన్సీ అవార్డులు  *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్ సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు): నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని రాజ్భవన్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఉత్తమ వైద్య సేవలను అందిస్తున్న బెస్ట్ డాక్టర్లకు రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి లు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులను...
Read More...
Local News  State News 

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో  - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి రైల్ రోకోకు భీం ఆర్మీ మద్దతు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం ప్రకటించిన నాయకులు హైదరాబాద్ జూలై 05 : ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో పౌర  సమాజం కలిసి...
Read More...
Local News 

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం.. చిన్నారులకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్ల పంపిణీ సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు): అనాథ పిల్లలకు సహాయం చేయడంలో ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో స్పందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట కృష్ణానగర్ కాలనీలోని ఆక్సిలియం నవజీవన అనాథ బాలిక ఆశ్రమంలో శనివారం చిలకలగూడకు చెందిన రామగిరి ప్రభాకర్ చిన్నారి బాలికలకు బ్లాంకెట్లు, జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ...
Read More...
Local News 

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్  మంచాల వరలక్ష్మీ భేటి సికింద్రాబాద్ జూలై 05 (ప్రజామంటలు ): తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను జాగృతి ఉపాద్యక్షురాలు మంచాల వరలక్ష్మీ శనివారం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత ఆరు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్న మంచాల వరలక్ష్మీ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. తన ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితను కలసి యోగ...
Read More...
Local News 

ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్    (గొల్లపల్లి ధర్మపురి ) జూలై 05 (ప్రజా మంటలు): జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ధర్మపురి మండల కేంద్రంలో  పర్యటించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి, ప్రమాదకర స్థితిలో ఉన్న తరగతి గదులను తక్షణమే కూల్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత సానిటేషన్ అంశంపై అధికారులతో సమీక్షించారు. డ్రైనేజీ,కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత...
Read More...
Local News 

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

చదువుతోపాటు సంస్కారం అందించాలి  -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్    జగిత్యాల జూలై 5 : (ప్రజా మంటలు) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు.  సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు రూ. ఒక లక్ష విలువైనడెస్క్లను అందజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...
Read More...
Local News 

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక *"  జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)   పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు...
Read More...
Local News 

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ    జగిత్యాల జూలై 5(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  సూచన మెరకు ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ, అపోలో రీచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తేదీ: 8.7.2025 మంగళవారం రోజున ఉదయం 9గంటల నుండి
Read More...
Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...