కృష్ణానగర్–కవాడిగూడ రోడ్లో పూర్తి అద్వాన్నంగా డ్రైనేజీ వ్యవస్థ
డ్రైనేజీ మురుగు నీటికి తోడు వర్షపు నీరు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 (ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ కృష్ణానగర్ కాలనీ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి కవాడిగూడ రోడ్ వరకు డ్రైనేజీ లైన్లు దెబ్బతినడంతో మురుగు నీరు వీధుల్లోకి వచ్చి పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మసీదు వద్ద వెదురు బొంగుల దుకాణాల వద్ద ఎక్కువగా నీరు చేరి వ్యాపారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ఈ సమస్యపై గతంలో చాలా సార్లు అధికారులకు విజ్ఞప్తి చేస్తే ఈ సమస్య తమ పరిధిలోకి రాదని అటు జలమండలి, ఇటు జీహెచ్ఎమ్సీ అధికారులు చెబుతున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చివరికి స్థానికులు జలమండలి జీఎం వినోద్కుమార్ , ఏజీఎం ఆశిష్, డివిజనల్ ఇంజనీర్ సన్నీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు మంగళవారం క్షేత్రపర్యటనకు వచ్చి, సమస్యను పరిశీలించారు. చాలా కాలంగా ఈ మురుగు నీటి సమస్యతో తాము నరకం చూస్తున్నమని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను కోరారు. జలమండలి, జీహెచ్ఎమ్సీ అధికారులు సమన్వయంతో పనిచేసి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక నాయకులు శీలం శివలింగం,షాయద్,ఎల్లేశ్,శ్రీనివాస్,దుర్గేశ్ తదితరులు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
