పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి
మంచిర్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు.
ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని బలపరిచేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీలను మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాయకత్వ మార్పుతో పాటు ప్రతి కార్యకర్తకు బాధ్యతాభారాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.
పార్టీ ఆలోచనలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు, మహిళలకు మరింత అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చగల ఏకైక శక్తిగా ఉన్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PCC అబ్జర్వర్ డాక్టర్ పులి అనిల్ కుమార్,PCC అబ్జర్వర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్,GCC చైర్మన్ కోట్నాక తిరుపతి, పిసిసి మెంబర్ నూకల రమేష్,PCC మెంబర్ కొండ శేఖర్, జిల్లా యూత్ అధ్యక్షులు అనిల్, జిల్లా మహిళా అధ్యక్షులు పెంట రజిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి బియాల తిరుపతి, సిరిపురం రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, లక్షట్ పేట్ టౌన్ సెక్రెటరీ ఎండి ఆరిఫ్, పట్టణ బ్లాక్ అద్యక్షులు నతిమేల రాజు, మండల అధ్యక్షులు వంగిలి రమేష్, తోట రవి, వెంకటేశ్వర్లు, RTA మెంబర్ ఆపతి శ్రీనివాస్,AMC మంచిర్యాల్ పత్యాల పద్మ ముని,AMC లక్షట్ పేట్ దాసరి ప్రేమ్ చందు ఆత్మ చైర్మన్ సంఘవి మురళి నాయకులు. తదితరులు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
