టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)
టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) ద్వారా పాఠాలు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం సందర్శించిన కలెక్టర్.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రోజురోజుకు సాంకేతికత వేంగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య అందించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు.
తరగతి గదులలో విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేసే విధంగా టిఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.వెనుకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు అర్థం అయ్యో విదంగా పాఠాలు బోధించాలని మరియు టి ఎల్ ఎం తప్పనిసరిగా వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా రీడింగ్, రైటింగ్ లకొరకు టిఎల్ఎం వినియోగించు కోవాలని సూచించారు.
జిల్లాలోని ప్రతి మండలం నుండి 10 మంది బెస్ట్ టిఎల్ఎం ల ద్వారా 200 ప్రదర్శనలు ఇచ్చారని,
స్టేట్ లెవెల్ ప్రదర్శనకు జిల్లా నుండి 8 మంది ని ఎంపిక చేసి పంపిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కే. రాము తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజా గౌడ్,జిల్లా సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ లు, మండల విద్యాధికారులు
పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
