గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్
కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 02 (ప్రజా మంటలు):
కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలకి కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క కేసును సిబిఐ కి అప్పగించడం నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మరియు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం తెలియజేశారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోస్కుల జలందర్, బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్, మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవం కాలేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలలో కేసీఆర్ గురించి విషపు బీజాలు నాటే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, రైతుల భవిష్యత్ తరాల ఆశ కాళేశ్వరం కుట్రలతో కుతంత్రాలతో ఈ ప్రాజెక్టును కించపరుస్తూ ప్రయత్నిస్తోందని అన్నారు.
ఈ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కేవలం ప్రాజెక్టు కాదు, ఇది తెలంగాణ రైతుల రక్తంతో చెమటతో నిండిన గౌరవం కాళేశ్వరం దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత
మన నీళ్లు, మన హక్కు. మన భవిష్యత్తు, మన గర్వం
కలిసి కాళేశ్వరాన్ని రక్షిద్దాం.కాలేశ్వరం ప్రాజెక్టు మొత్తం విఫలమైందని మాట్లాడడం సరికాదని, కాలేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు,15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్ లు, 231 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాన్లు, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం, 240 టీఎంసీల నీటి ఉపయోగం, ఇంత పెద్ద ప్రాజెక్టులో 100 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లు కుంగడాన్ని రాద్దాంతం చేస్తున్నారని, కమిషన్ల పేరుతో కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ దిష్టి బొమ్మ కాల్చే క్రమంలో పోలీస్ లు ఆపే ప్రయత్నం లో బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోస్కుల జలందర్, మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్, పాక్స్ చైర్మన్ చంధోలి వెంకట మాధవ్ రావ్, ఆవుల సత్యం, కాంపెల్లి హన్మాండ్లు, నేరెళ్ల గంగారెడ్డి, ఎరవేణి రమేష్, అధ్యక్షులు బాలాభక్తుల కిషన్, ఆవారి చందు, సామాల విరస్వామి, లింగారెడ్డి, నాయకులు అలిశెట్టి రవి,మారం రాజశేఖర్, నల్ల శ్యామ్, శోభన్ గౌడ్, కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్

BRS నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావుకు పార్టీ మద్దతు!
