విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి
విద్యార్థులకు ఆహార పదార్థాలు సమయానికి అందించాలి.
- మారేడ్పల్లి గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన కలెక్టర్ హరిచందన
సికింద్రాబాద్, జూలై 29(ప్రజామంటలు) :
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు.మంగళవారం సికింద్రాబాద్ మారేడుపల్లి లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలని ముఖ్యంగా డిజిటల్ విద్యాబోధనపై విద్యార్థులకు ఎక్కువ మక్కువ కలిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. గత సంవత్సరం పదో తరగతిలో పదిమందికి పైగా విద్యార్థులు అత్యధిక మార్కుల సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు.ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆ దిశగా విద్య బోధన ఉండాలని ఆమె సూచించారు. పాఠశాలలోని వివిధ సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్స్ టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ సమయానికి అందించారా అన్న విషయంతో పాటు విద్యార్థుల సంఖ్య తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం లో భాగంగా విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన సమయానికి ఆహార పదార్థాలు అందించాలని ఆమె సూచించారు. అదే ప్రాంగణంలో ఉన్న ఇంటర్ కళాశాల, ప్రీ ప్రైమరీ పాఠశాలలో వసతులు, అందుతున్న విద్య బోధన పై సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, హెచ్ఎం మోహన్ ఆచారి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
