గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
త్వరలో రహదారి సమస్యకు పరిష్కారం చేస్తాను - మంత్రి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో స్మశాన వాటికకు సరైన రహదారి లేక గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దారి లేక మట్టిలోనూ, పొలాల్లోనూ మోసుకెళ్లే దుస్థితి నెలకొనగా, ఈ సమస్య పట్ల గత పదేళ్లుగా పాలనలో ఉన్న నేతలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు మంత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ తో విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలాన్ని సందర్శించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికనాయకులు,ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో కలిసి స్మశాన వాటిక స్థితిని, రహదారి లేదని ఎదురయ్యే సమస్యలను వివరంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఒక గ్రామంలో స్మశాన వాటికకు కూడా రహదారి లేకపోవడం బాధాకరమని,ఇది మన పౌరుల మౌలిక హక్కులకు వ్యతిరేకమని,ఈ సమస్యను ఇకమీదట ఇలాగే వదిలిపెట్టే ప్రసక్తే లేదని,అవసరమైన నిధులు మంజూరు చేయించి, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధుసూదన్, మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ ఛైర్మన్ పుర పాటి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ తాసిల్దార్ కటకం వరంధన్, ఎంపీడీవో రాంరెడ్డి,నాయకులు మార్కెట్ డైరెక్టర్ కొక్కుల జలంధర్, రాపల్లి గంగన్న, బుచ్చిరెడ్డి కార్యకర్తలు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
