నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సికింద్రాబాద్ జులై 10 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తున్న హిందీ అధికారిక భాషా విభాగం 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక భాషా విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ మీనాక్షీ జాలీ తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీఓ టవర్స్లో ఆమె శుక్రవారం మీడియాకు వివరాలు వెలడించారు. అధికార భాషా విభాగాన్ని 1975 జూన్ 26న ఏర్పాటు చేశామని, ఈ యేడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్బంగా గతనెల 26న ఢిల్లీలో గోల్డెన్జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు.
దీనికి తరువాత భాగంగా దక్షిణ్ సంవాద్’’ వేడుకల పరంపరలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో రెండోసారి ఉత్సవాలునిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె వివరించారు.దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, స్కాలర్లు, భాష పట్ల ఉత్సాహం కనబరచే వారు పెద్ద సంఖ్యలో హాజరు అవుతారని,వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటకలతో పాటు పుదుచ్చేరీకి చెందిన వారు ఉంటారని ఆమె చెప్పారు.
స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలను ఈ వేడుకలో సత్కరించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాదులోని పత్రిక సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ ఈ మీడియా సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమావేశంలో తమిళనాడు,కేరళ, కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఆయా భాషల్లో ప్రసంగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్
