కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

On
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ విమలాకర్

సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు):

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట్‌లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి  నేతృత్వంలోని టీమ్ విమలాకర్ కేవలం మూడు నెలల వ్యవధిలో 50 మేజర్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అధునాతన శస్త్రచికిత్సల్లో ప్యాంక్రియాస్, కాలేయం, బైలరీ ట్రాక్ట్, కొలాన్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు మరియు కాంప్లెక్స్ అబ్డోమినల్ వాల్ రీకన్స్ట్రక్షన్‌లు ఉన్నాయి. ఇవన్నీ Da Vinci రోబోటిక్ సర్జికల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించారు. అన్ని శస్త్రచికిత్సలు అత్యుత్తమ ఫలితాలతో, ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గురువారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ బేగంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి మాట్లాడుతూ ఆర్థోపెడిక్స్ విభాగంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో నాలుగు రోబోలు ఉన్నాయని, ఇండియాలో నాలుగు రోబోలు ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇదొక్కటే అన్నారు. ఇప్పటివరకు పదివేలకు పైగా  ఆర్థోపెడిక్ శాస్త్రాజకిత్సలను విజయవంతంగా నిర్వహించామని, ఆ అనుభవంతోనే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అబ్డామిన్లో క్లిష్టమైన శాస్త్ర చికిత్సలను డా వించి రోబోటిక్స్ సాయంతో మూడు నెలల్లోనే 50 కి పైగా శస్త్ర చికిత్సలను  నిపుణులైన డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ రోబోటిక్స్ వల్ల ఆపరేషన్ చేసే సమయంలో సేఫ్టీ, గ్యారంటీ ఉంటుందన్నారు. టెక్నాలజీ, హ్యూమన్ టచ్ అందజేస్తూ రోగులను గెస్ట్లుగా ట్రీట్ చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ & హెడ్ – సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, GI ఆంకాలజీ, బేరియాట్రిక్, రోబోటిక్ సర్జరీ & లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్  సర్జన్ డా. విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ "రోబోటిక్ సర్జరీ ఇప్పుడే అధునాతన అబ్డోమినల్ శస్త్రచికిత్సల కోసం గోల్డ్ స్టాండర్డ్‌గా మారింది. దీనిలో ఉన్న 3D విజన్, రిస్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వల్ల అత్యంత క్లిష్టమైన భాగాల్లో కూడా ఖచ్చితమైన డిసెక్షన్ చేయవచ్చు. ఇది రక్తస్రావం తక్కువగా ఉండేలా, తక్కువ సంక్లిష్టతలతో, త్వరితపరిచే కోలుకునేలా చేస్తుందని తెలిపారు. తక్కువ నొప్పి, తక్కువ ఆసుపత్రి సమయం, త్వరితంగా సాధారణ జీవితానికి తిరిగి రావడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వృద్ధులు మరియు క్యాన్సర్ పేషెంట్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమయానుసారంగా పోషణ వారిలో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.టీమ్ విమలాకర్ యొక్క సర్జికల్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, మరియు పేషెంట్ ఫస్ట్ కెర్ పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. robotic శస్త్రచికిత్సల్లో విద్య, శిక్షణ, మరియు క్లినికల్ రీసెర్చ్ కార్యక్రమాలలో ఈ టీం చురుకుగా పాల్గొంటూ, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్  దేశంలో అగ్రగామి రోబోటిక్ GI సర్జరీ సెంటర్‌గా నిలిపే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.  ఈ సందర్భంగా శాస్త్ర చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన పేషెంట్లు  వారి అనుభవాలను పంచుకున్నారు.

డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్యాంక్రియాస్, హెర్నియా, లివర్ సంబంధ సమస్యలతో బాధపడుతున్న తాము శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్నామని తెలిపారు. అనంతరం డాక్టర్ విమలాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మినిమల్ యాక్సెస్, రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీల మధ్య ఉన్న తేడాను వివరించడంతోపాటు, రోబోటిక్ సర్జరీలతో ఉన్న ప్రయోజనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం విమలాకర్ డాక్టర్ల బృందం పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్ రూ.95150/- నగదు స్వాధీనం జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల విద్యానగర్ లో  ఓ ఇంట్లో  పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం తో సీఐ కరుణాకర్, తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్...
Read More...
Local News 

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని  వారసిగూడా పోలీసులు ఆటెన్షన్‌ డైవర్షన్‌ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్‌ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్‌ సెట్‌, ఒక వీవో మొబైల్‌, రూ.4,300 నగదు, బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్...
Read More...
Local News  State News 

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. -...
Read More...
Local News 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.  జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.    జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.  జగిత్యాల ఆగస్టు 31(ప్రజా మంటలు)సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

 మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్ జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్ లో అమరత్ మిలాత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ అవార్డులు అందజేశారు.  మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...మహిళలను...
Read More...
Local News 

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల పక్కన పుటపాతులే ఆవాసంగా జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, నిరుపేదలు, సంచార జాతుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత ఆవాసంతో పాటు ఉపాధిని కల్పించి, నూతన జీవితాన్ని ప్రసాదించాలన్నారు. ఆదివారం సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాత్...
Read More...
Local News 

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని  రెడ్ హిల్స్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు  గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గణేశ్ మహరాజ్ సేవలో తరిస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్థానిక యువకులు భక్తి ప్రవత్తులతో గణేశుడి ప్రతిమను పెట్టి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేశుడి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ భూమిపూజ చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నంలోని రెండు ముదిరాజ్  సంఘాలకు 5లక్షలు, గంగపుత్ర సంఘానికి 4లక్షలు, గ్రామంలోని పంచముఖి హనుమాన్ ఆలయం దగ్గర 1,35లక్షల నిధులను, నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి ₹10,35,000 మంజూరు చేశారు. ఈపనులకు   కాంగ్రెస్,...
Read More...
Local News 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలము వర్ష కొండ గ్రామంలోని దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ గణపతి మండపంలో ఆదివారం రోజున కుంకుమ అర్చన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో యూత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Read More...
Local News  State News 

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) :  జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నేడు స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి సైకిల్ రేస్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి...
Read More...
Local News 

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు సికింద్రాబాద్, ఆగస్టు 31(ప్రజామంటలు):  సికింద్రాబాద్ న్యూ బోయిగూడ ఎంఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు, ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, ట్రెజరర్ కె. సేతుమాధవ రావు, సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాసన్, కార్యవర్గ సభ్యులు వి....
Read More...

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Read More...