మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

On
మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం

ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ

తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న

కొత్తగూడెం జూలై 10: 


 "పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ కింద తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం" అని స్పష్టం చేశారు. 

కొత్తగూడెంలో  బుధవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి విస్తృత సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు,  సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న తన అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి లో చేరారు. ఆయనకు తెలంగాణ జాగృతి కండువాను కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.

IMG-20250710-WA0017తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, సంపూర్ణ రైతురుణమాఫీ కాలేదనీ, ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటే సీఎం పారిపోయారని మండిపడ్డారు.ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని తెలిపారు.

సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదని ప్రస్తావించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి,అసమర్థ ముఖ్యమంత్రి అనే బిరుదు ఇచ్చామని చెప్పారు. మహిళల పక్షాన జాగృతి పోరాటం చేస్తుందనీ స్పష్టం చేశారు. 

"కొత్తగూడెం జిల్లా అంటే పరిశ్రమలు ఉండే జిల్లా. ఐటీసీలో కాలుష్యం లేకుండా పరిశ్రమ యాజమాన్యం దృష్టి సారించాలి. స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని పునరుద్ధరణ చేయాలి." అని డిమాండ్ చేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో తిరిగి కలపాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 

"భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆందోళనలో ఉన్నాయి. భద్రాచలం రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయి.ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చొరవ తీసుకోవాలి. తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు తుమ్మల ఐదు గ్రామ పంచాయతీలపై లెటర్ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో ఉన్న రాముడి భూములను చూడటానికి వెళ్లిన రామాలయం ఈవోపై దాడి చేశారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడు." అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడబిడ్డ,బీసీ బిడ్డ భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే 70 శాతం పూర్తయ్యాయని.. మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags

More News...

Local News 

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్ రూ.95150/- నగదు స్వాధీనం జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల విద్యానగర్ లో  ఓ ఇంట్లో  పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం తో సీఐ కరుణాకర్, తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్...
Read More...
Local News 

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని  వారసిగూడా పోలీసులు ఆటెన్షన్‌ డైవర్షన్‌ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్‌ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్‌ సెట్‌, ఒక వీవో మొబైల్‌, రూ.4,300 నగదు, బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్...
Read More...
Local News  State News 

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. -...
Read More...
Local News 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.  జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.    జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.  జగిత్యాల ఆగస్టు 31(ప్రజా మంటలు)సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

 మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్ జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్ లో అమరత్ మిలాత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ అవార్డులు అందజేశారు.  మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...మహిళలను...
Read More...
Local News 

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల పక్కన పుటపాతులే ఆవాసంగా జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, నిరుపేదలు, సంచార జాతుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత ఆవాసంతో పాటు ఉపాధిని కల్పించి, నూతన జీవితాన్ని ప్రసాదించాలన్నారు. ఆదివారం సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాత్...
Read More...
Local News 

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని  రెడ్ హిల్స్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు  గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గణేశ్ మహరాజ్ సేవలో తరిస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్థానిక యువకులు భక్తి ప్రవత్తులతో గణేశుడి ప్రతిమను పెట్టి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేశుడి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ భూమిపూజ చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నంలోని రెండు ముదిరాజ్  సంఘాలకు 5లక్షలు, గంగపుత్ర సంఘానికి 4లక్షలు, గ్రామంలోని పంచముఖి హనుమాన్ ఆలయం దగ్గర 1,35లక్షల నిధులను, నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి ₹10,35,000 మంజూరు చేశారు. ఈపనులకు   కాంగ్రెస్,...
Read More...
Local News 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలము వర్ష కొండ గ్రామంలోని దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ గణపతి మండపంలో ఆదివారం రోజున కుంకుమ అర్చన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో యూత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Read More...
Local News  State News 

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) :  జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నేడు స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి సైకిల్ రేస్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి...
Read More...
Local News 

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు సికింద్రాబాద్, ఆగస్టు 31(ప్రజామంటలు):  సికింద్రాబాద్ న్యూ బోయిగూడ ఎంఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు, ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, ట్రెజరర్ కె. సేతుమాధవ రావు, సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాసన్, కార్యవర్గ సభ్యులు వి....
Read More...

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Read More...