విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన
సికింద్రాబాద్, జూన్ 11 ( ప్రజామంటలు):
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-కూకట్పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా, ఎస్ ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేకపోవడమే కాక పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చెయ్యాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ప్రజా పాలన అంటూ పేదల పెన్నిధి అంటూనే ఇలాంటి ప్రతిపాదనల ద్వారా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెచ్చి 400 నుండి 600 రూపాయలు బస్ చార్జీలను పెంచడం దాదాపుగా ఒకేసారి 20 నుండి 25 శాతం పెంచడమే కాక గత మూడు సంవత్సరాల్లో 200శాతం ఫీజు పెంచడం సరికాదని అన్నారు.కావున వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఊరట కల్పించాలని లేని పక్షంలో రాష్ట్రమంతా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్ఎఫ్డీ సిటి కన్వీనర్ పాండురంగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కావాలనే పేద,మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే లక్ష్యంగా ఈ బస్ చార్జీలను 20శాతం పెంపు నిర్ణయాన్ని తీసుకుందని ఆరోపించారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని సిగ్గుమాలిన చర్యను మానుకొని బస్సు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకొని సామాన్య మధ్యతరగతి విద్యార్థులను విద్యను అందుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ నగర్ టౌన్ సెక్రటరీ నందు,సోహాన్ కుమార్ , నగర కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
