విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన
సికింద్రాబాద్, జూన్ 11 ( ప్రజామంటలు):
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-కూకట్పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా, ఎస్ ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేకపోవడమే కాక పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చెయ్యాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ప్రజా పాలన అంటూ పేదల పెన్నిధి అంటూనే ఇలాంటి ప్రతిపాదనల ద్వారా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెచ్చి 400 నుండి 600 రూపాయలు బస్ చార్జీలను పెంచడం దాదాపుగా ఒకేసారి 20 నుండి 25 శాతం పెంచడమే కాక గత మూడు సంవత్సరాల్లో 200శాతం ఫీజు పెంచడం సరికాదని అన్నారు.కావున వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఊరట కల్పించాలని లేని పక్షంలో రాష్ట్రమంతా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎస్ఎఫ్డీ సిటి కన్వీనర్ పాండురంగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కావాలనే పేద,మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే లక్ష్యంగా ఈ బస్ చార్జీలను 20శాతం పెంపు నిర్ణయాన్ని తీసుకుందని ఆరోపించారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని సిగ్గుమాలిన చర్యను మానుకొని బస్సు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకొని సామాన్య మధ్యతరగతి విద్యార్థులను విద్యను అందుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ నగర్ టౌన్ సెక్రటరీ నందు,సోహాన్ కుమార్ , నగర కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)