ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
గొల్లపల్లి జూన్ 11 (ప్రజా మంటలు) :
గొల్లపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు గొల్లపల్లి మండలంకు సంబంధించిన 389 మందికి మంజూరు పత్రాల పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్,జిల్లా ఆర్డీవో తో కలిసి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టి దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని,ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని,ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరువందల స్క్వేర్ ఫీట్స్లో ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని,పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులు ఇంటి నిర్మానాణాలు ప్రారంభించడం లేదని,వారు కూడా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని,ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రాని వారు ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్ ,ఎస్సీ కార్పొరేషన్ కిషోర్ , తాసిల్దార్ వరంధన్ , మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఎంపీడీవో రామ్ రెడ్డి, సంబంధిత అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్క్ నిశాంత్ రెడ్డి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)