మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

On
మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

కార్పొరేట్ల‌కు 16.5 ల‌క్ష‌ల కోట్లు రుణ‌మాఫీ చేసిన బీజేపీకి మ‌హిళ‌ల‌కు రుణం ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సురాదా ?అబ‌ద్దాల‌తో మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం. గ్యాస్ ధ‌ర‌ను పెంచి మ‌హిళ‌లపై మోదీ సర్కార్ గుదిబండ‌ను మోపింది
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్  : మ‌హిళల‌కు స్వావ‌లంభ‌న క‌ల్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, మ‌హిళా సంఘాల‌కు రూ 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అందించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల‌కు రూ. 16.5 ల‌క్ష‌ల మేర రుణ‌మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సు రావ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాయ‌మాట‌లు చెబుతూ మ‌హిళ‌ల‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిప‌డ్డారు.

బుధ‌వారం నాడు తెలంగాణ మ‌హిళా సాధికార‌త స‌మాఖ్య సంఘం స‌భ్యులు ఎమ్మెల్సీ క‌వితను త‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ... కేసీఆర్ హ‌యాంలో ఎప్పుడూ తాము అబ‌ద్దం చెప్ప‌లేదని, మ‌హిళా సంఘాల‌కు రూ 5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్నామ‌నే చెప్పామ‌ని, కానీ ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం రూ 20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న‌ట్లు అబ‌ద్దాలు చెబుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా రూ 5 ల‌క్ష‌ల మేర‌నే వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్న‌ద‌ని, కానీ అబ‌ద్దాలు చెప్పి మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రాలు ఏ చిన్న ప‌ని చేసినా కేంద్ర ప్ర‌భుత్వం త‌మ భాగ‌స్వామ్యం కూడా ఉంద‌ని చెప్పుకుంటుంద‌ని, ప్ర‌తీ చిన్న ప‌నికి నిధులు ఇచ్చే కేంద్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌లకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని నిందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రస్తుతం రూ 5 ల‌క్ష‌ల వ‌రకు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. బ్యాంకుల‌కు రుణాలు ఎగ‌వేసి లూటీ చేసే పెద్ద పెద్ద వ్యాపార‌వేత్త‌ల‌కు రూ 16.5 ల‌క్ష‌ల మేర రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మాఫీ చేసింద‌ని, కానీ మ‌హిళ‌ల‌కు మాత్రం రుణాలు ఇవ్వ‌డానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌న‌సు రాక‌పోవ‌డం శోచనీయ‌మ‌ని అన్నారు. నిజంగా మ‌హిళ‌ల అభివృద్ధి ప‌ట్ల చిత్త‌శుద్ది ఉంటే మ‌హిళ‌ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాల‌ని సూచించారు.

మ‌హిళ‌ల సంక్షేమాన్ని విస్మ‌రించిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం గ్యాసు ధ‌ర‌ను రూ 50 పెంచి గుదిబండ‌ను మోపిందని మండిప‌డ్డారు. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుతుంటే ఇక్క‌డ పెంచ‌డ‌మేంటని నిల‌దీశారు. ఎందుకు పెంచుతున్నార‌ని ప్ర‌శ్నిస్తే ప్ర‌ధాని మోదీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అని బీజేపీ నాయ‌కులు అంటున్నార‌ని, ఇలా ఇష్ట‌మున్న‌ట్లు ధ‌ర‌లు పెంచితే మోదీ ఎంత గొప్ప వ్య‌క్తి అయితే మాకేంటి అని అన్నారు.

Tags

More News...

Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...
Local News 

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు సిఐటియూ జెండాను  ఆవిష్కరించిన మండల సిఐటియు  అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు....
Read More...
Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...