కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 03 (ప్రజా మంటలు):
జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం పెగడపెల్లి మండలం నంచర్ల నుండి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.గత కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర మంత్రి గా వ్యవహరిస్తున్న అమీషా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగాఖండిస్తున్నామని,వారిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనిడిమాండు చేశారు.
ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ప్రతి గ్రామ గ్రామాన తెలిపే విధంగా జై బాపు,జై భీం,జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందనీ,దీన్నీ బట్టి బీజేపీ పార్టీ అణచివేత ధోరణి,కుటిల బుద్ధి బయటపడిందని,అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు మోడీ గారు,ప్రధానమంత్రి కుర్చీలో అమిత్ షా హోం శాఖ కుర్చీలో కూర్చున్నారన్న విషయం మర్చిపోవద్దని,నేను ఒక ఎమ్మెల్యేగా,విప్ గా హోదాలో కొనసాగుతున్న అంటే దానికి అంబేద్కర్ పెట్టిన బిక్ష అని,అమిత్ షా పైన చర్యలు తీసుకొని వారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేంత వరకు పాదయాత్ర మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
