గాంధీ మెడికల్ కాలేజ్లో రాష్ట్ర స్థాయి ఈఎన్టీ వైద్యుల సదస్సు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 21 (ప్రజామంటలు) :
తెలంగాణ ఈఎన్టీ వైద్యుల సంఘం (ఏఓఐ) ,గాంధీ మెడికల్ కాలేజ్ ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన AOI TG CON–2025 రాష్ట్ర స్థాయి ఈఎన్టీ వైద్యుల రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. రెండు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు, శస్త్రచికిత్స వైద్యులు, పరిశోధకులు, యువ వైద్యులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతలు, కొత్త చికిత్సా విధానాలు, తాజా పరిశోధనలు పై విస్తృత చర్చలు జరిగాయి. ఈఎన్టీ యొక్క అన్ని ఉప-విభాగాలు ఓటాలజీ, రైనాలజీ, లారింజాలజీ, హెడ్ & నెక్ ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈఎన్టీ , స్కల్ బేస్ సర్జరీ, ఎండోస్కోపిక్ & రోబోటిక్ సర్జరీలపై జరిగిన చర్చలో వైద్యులు పాల్గొన్నారు. యువ వైద్యులకు శాస్త్రీయ పత్రాల ప్రదర్శనలు, పోస్టర్ ప్రెజెంటేషన్స్ ద్వారా అనుభవం పెంచే అవకాశం కల్పించారు. ఆధునిక వైద్య పరికరాల ప్రదర్శన కూడా సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ..ఈ సదస్సు ద్వారా యువ వైద్యులకు అత్యాధునిక పరిజ్ఞానం చేరుతుందని,రోగులకు మెరుగైన చికిత్సా విధానాలు అందించడంలో ఇది సహకరించనుందన్నారు.
వైద్యుల మధ్య అనుభవాల మార్పిడి, పరిశోధన, సేవా రంగాల్లో కొత్త మార్గాలు సుగమం అవుతాయన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి, తెలంగాణ ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ర్ట అద్యక్షులు డాక్టర్ శోభన్ బాబు, రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్, వైస్ ప్రెసిడెంట్ డా.రమేశ్,సెక్రటరీ డా.ఆనంద్ తో పాటు దాదాపు 700 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్
