కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

On
 కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ ఆగస్ట్ 30 (ప్రజా మంటలు):

నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు. 

హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. “సిద్ధాంతాలు చెప్పడమే కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం 65 సంవత్సరాలు నిబద్ధతతో జీవించడం ద్వారా సురవరం గారికి ఆ గౌరవం దక్కింది. వారు ఏ జెండాను మోశారో, ఏ జెండా మోయడం గొప్పగా భావించారో.. చివరి శ్వాస తర్వాత కూడా ఆ జెండా నీడనే విశ్రమించడం అత్యంత అరుదు.  

ప్రజలతో గుర్తింపబడిన మహనీయుల పేర్లు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నిలవాలి. అందుకే తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు, కోఠీ మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ గారి పేరు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టుకున్నాం. సామాన్య ప్రజల్లో చైతన్యం నింపి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గారు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ట్యాంక్‌బండ్‌పై వారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటున్నాం.

 ఒక ప్రాంతం నుంచి సమాజంలో గుర్తింపు పొందిన ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఆ ప్రాంత వాసులకు గర్వంగా ఉంటుంది. మొదటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి గారు, బూర్గుల రామకృష్ణా రావు గారు, రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు మహబూబ్‌నగర్ జిల్లాకు వన్నె తెచ్చారు. వారెప్పుడు సమాజంలో గౌరవం పొందుతూనే ఉంటారు.  IMG_20250830_204651

 సురవరం విజయలక్ష్మి చిన్న కోరికలు కోరారు. వారి గౌరవం ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు. సురవరం సుధాకర్ రెడ్డి గౌరవం, రాష్ట్ర స్థాయిలో ఉండే విధంగా శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. 

 ప్రస్తుతం సమాజంలో ప్రజాస్వామిక మూల సిద్ధాంతానికి విరుద్ధంగా పెరిగిపోతున్న విపరీత పోకడలను అడ్డుకోవలసిన అవసరం ఉంది. ప్రజల ప్రాథమిక హక్కులను హరించే ప్రమాదకర పరిస్థితులను తలెత్తుతున్నాయి. ప్రజలను చైతన్య పరిచే ఆలోచన ఎవరూ చేయడం లేదు. అందుకోసం ఐక్య కార్యాచరణ నిర్మించుకోవాలి. అప్పుడే సురవరం లాంటి నేతకు ఘనమైన నివాళి..” అని ముఖ్యమంత్రి అన్నారు. 

ఈ సంస్మరణ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు , సురవరం విజయలక్ష్మి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీనియర్ నాయకులు కె. నారాయణ, కేవీపీ రామచందర్ రావు, రామకృష్ణ, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్ రూ.95150/- నగదు స్వాధీనం జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల విద్యానగర్ లో  ఓ ఇంట్లో  పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం తో సీఐ కరుణాకర్, తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్...
Read More...
Local News 

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని  వారసిగూడా పోలీసులు ఆటెన్షన్‌ డైవర్షన్‌ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్‌ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్‌ సెట్‌, ఒక వీవో మొబైల్‌, రూ.4,300 నగదు, బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్...
Read More...
Local News  State News 

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. -...
Read More...
Local News 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.  జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.    జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.  జగిత్యాల ఆగస్టు 31(ప్రజా మంటలు)సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

 మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్ జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్ లో అమరత్ మిలాత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ అవార్డులు అందజేశారు.  మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...మహిళలను...
Read More...
Local News 

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల పక్కన పుటపాతులే ఆవాసంగా జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, నిరుపేదలు, సంచార జాతుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత ఆవాసంతో పాటు ఉపాధిని కల్పించి, నూతన జీవితాన్ని ప్రసాదించాలన్నారు. ఆదివారం సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాత్...
Read More...
Local News 

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని  రెడ్ హిల్స్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు  గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గణేశ్ మహరాజ్ సేవలో తరిస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్థానిక యువకులు భక్తి ప్రవత్తులతో గణేశుడి ప్రతిమను పెట్టి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేశుడి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ భూమిపూజ చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నంలోని రెండు ముదిరాజ్  సంఘాలకు 5లక్షలు, గంగపుత్ర సంఘానికి 4లక్షలు, గ్రామంలోని పంచముఖి హనుమాన్ ఆలయం దగ్గర 1,35లక్షల నిధులను, నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి ₹10,35,000 మంజూరు చేశారు. ఈపనులకు   కాంగ్రెస్,...
Read More...
Local News 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలము వర్ష కొండ గ్రామంలోని దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ గణపతి మండపంలో ఆదివారం రోజున కుంకుమ అర్చన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో యూత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Read More...
Local News  State News 

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) :  జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నేడు స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి సైకిల్ రేస్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి...
Read More...
Local News 

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు సికింద్రాబాద్, ఆగస్టు 31(ప్రజామంటలు):  సికింద్రాబాద్ న్యూ బోయిగూడ ఎంఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు, ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, ట్రెజరర్ కె. సేతుమాధవ రావు, సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాసన్, కార్యవర్గ సభ్యులు వి....
Read More...

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Read More...