అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

On
అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని గృహనిర్బంధం చేసిన పోలీసులు 

సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు) :
 
రంగారెడ్డి జిల్లాలోని అనాజ్ పూర్ గ్రామంలో పేదలకు చెందిన 125 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈ మేరకు శనివారం అనాజ్ పూర్ గ్రామానికి చెందిన రైతులు స్థానికులు చలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడంతో బోలక్ పూర్ లోని సిపిఎం కార్యాలయంలో గాంధీనగర్ పోలీసులు జాన్ వెస్లీని గృహ నిర్బంధం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రామోజీ ఫిలిం సిటీ సమీపంలో ఉన్న అనాజ్ పూర్ గ్రామస్తులకు అనేక ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 125 ఎకరాలను పేద రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 125 ఎకరాల భూమిని తిరిగి లాక్కుని దానిని టూరిజం డెవలప్మెంట్ పేరుతో రామోజీ ఫిలిం సిటీకి అప్పగించాలని చూస్తున్నదని అన్నారు. దీనిపై అక్కడ రైతులు కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, వారికి తాము మద్దతుగా నిలిచావని అన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ లో సినిమా షూటింగ్ ల వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తుందని, వారికి అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 350 ఎకరాలను వారికి అప్పగించడానికి కుట్ర పన్నిందని అన్నారు.

ప్రస్తుతం అక్కడ ఎకరానికి రూ.5 కోట్ల విలువ కలిగి ఉన్నదని, అందుకే అనాజ్ పూర్ కు చెందిన పేద రైతుల భూములను లాక్కుంటుందని, వారికి పట్టా పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని, భూమి యజమానుల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి చలో అసెంబ్లీ చేపట్టిందని, వారికి న్యాయం లభించేంతవరకు సిపిఎం పార్టీ వారికి అండగా నిలబడి న్యాయ పోరాటంలో పాల్గొంటుందని జాన్ వెస్లీ అన్నారు.

Tags

More News...

Local News 

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్ రూ.95150/- నగదు స్వాధీనం జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల విద్యానగర్ లో  ఓ ఇంట్లో  పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం తో సీఐ కరుణాకర్, తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్...
Read More...
Local News 

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని  వారసిగూడా పోలీసులు ఆటెన్షన్‌ డైవర్షన్‌ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్‌ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్‌ సెట్‌, ఒక వీవో మొబైల్‌, రూ.4,300 నగదు, బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్...
Read More...
Local News  State News 

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. -...
Read More...
Local News 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.  జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. 

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి.    జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.  జగిత్యాల ఆగస్టు 31(ప్రజా మంటలు)సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

 మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్ జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్ లో అమరత్ మిలాత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ అవార్డులు అందజేశారు.  మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...మహిళలను...
Read More...
Local News 

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల పక్కన పుటపాతులే ఆవాసంగా జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, నిరుపేదలు, సంచార జాతుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత ఆవాసంతో పాటు ఉపాధిని కల్పించి, నూతన జీవితాన్ని ప్రసాదించాలన్నారు. ఆదివారం సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్ పాత్...
Read More...
Local News 

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని  రెడ్ హిల్స్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు  గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గణేశ్ మహరాజ్ సేవలో తరిస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్థానిక యువకులు భక్తి ప్రవత్తులతో గణేశుడి ప్రతిమను పెట్టి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేశుడి...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ భూమిపూజ చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నంలోని రెండు ముదిరాజ్  సంఘాలకు 5లక్షలు, గంగపుత్ర సంఘానికి 4లక్షలు, గ్రామంలోని పంచముఖి హనుమాన్ ఆలయం దగ్గర 1,35లక్షల నిధులను, నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి ₹10,35,000 మంజూరు చేశారు. ఈపనులకు   కాంగ్రెస్,...
Read More...
Local News 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన 

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి  కుంకుమార్చన  ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలము వర్ష కొండ గ్రామంలోని దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ గణపతి మండపంలో ఆదివారం రోజున కుంకుమ అర్చన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో యూత్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Read More...
Local News  State News 

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) :  జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నేడు స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి సైకిల్ రేస్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి...
Read More...
Local News 

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో  ఘనంగా గణేష్ నవరాత్రులు సికింద్రాబాద్, ఆగస్టు 31(ప్రజామంటలు):  సికింద్రాబాద్ న్యూ బోయిగూడ ఎంఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. హనుమాన్లు, ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, ట్రెజరర్ కె. సేతుమాధవ రావు, సంయుక్త కార్యదర్శి వి. శ్రీనివాసన్, కార్యవర్గ సభ్యులు వి....
Read More...

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Read More...