జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్టు 15 ( ప్రజా మంటలు)
జిల్లా పోలీస్ కార్యాలయం లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎస్పీ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ, అధికారులకు, సిబ్బందికి ముందుగా 79 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ స్టాల్ ప్రదర్శన
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో పోలీస్ శాఖ వారిచే ఏర్పాటు చేయబడిన స్టాల్, డాగ్ స్క్వాడ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ యొక్క స్టాల్ లో పోలీస్ వ్యవస్థ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉపయోగించే అధునాతన సాధనాలు, పోలీస్ శాఖ అవలంబిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ క్రైమ్, షీ టీమ్స్, ప్రింగర్ ప్రింట్, కమ్యూనికేషన్, బాబ్ డిస్పోసల్ టీమ్, ఆయుధాల గ్యాలరీ, డాగ్ స్క్వాడ్ , మొదలగు వాటి పై సవివరంగా తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన స్టాల్స్ ల ప్రదర్శన అందరిని ఆకర్షించింది.
ఈ కార్యక్రమంలో SB డిఎస్పి వెంకటరమణ, సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ,మెట్పల్లి డిఎస్పి రాములు,DCRB,SB,IT CORE ,FINGER PRINTS ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్ ,ఆరిఫ్ అలీ ఖాన్ , రఫిక్ ఖాన్ ,శ్రీధర్ రిజర్వు ఇన్స్పెక్టర్లు, కిరణ్ కుమార్ , వేణు, సైదులు మరియు రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ లు, DPO కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
.jpg)
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
