బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు
- అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- భక్తులతో కిక్కిరిసిన ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసరాలు - పోలీసుల భారీ బందోబస్తు
సికింద్రాబాద్, జూలై 13 (ప్రజామంటలు):
లష్కర్ లో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్త జన కోటి ఉజ్జయిని శ్రీమహాకాళి ఆలయానికి పోటెత్తారు. భక్తి ప్రవత్తులతో తమ ఇలవేల్పు ఉజ్జయిని మహాకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పించి, తమ మొక్కులను తీర్చుకున్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11.40 గంటలకు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈసందర్బంగా ఉజ్జయిని అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను సమర్పించారు.
ప్రతి ఏటా ఆషాడ మాసంలో మొదటి ఆదివారం జరిగే శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి అర్చకులు చేసిన తొలి పూజలతో బోనాల జాతర ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఆలయాన్ని సందర్శించి, ఆలయ సంప్రదాయనుసారంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి, పూజలు చేశారు.
ఉదయం నుంచి వివిద ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు తలపై బోనం ఎత్తుకొని, క్యూలైన్ ద్వారా ఆలయంలోనికి వెళ్ళి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. అలాగే సిటీలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల నుంచి శివసత్తులు, జోగినిలు తమ బృందంతో భాజభజంత్రీలు, పోతరాజులు, ఒగ్గుడోలు విన్యాసాలతో ఆలయానికి వచ్చి, బోనాలు సమర్పించారు. చాలా మంది భక్తులకు అమ్మవారు పూనడంతో వారు పూనకంతో ఊగిపోయారు. తోటి భక్తులు అమ్మవారి బొట్టు వీరికి పెట్టి, శాంతింప చేసి, త్వరగా అమ్మవారి దర్శనానికి లోనికి తీసుకువెళ్ళారు. ఆయా ఆలయాల నుంచి తొట్టెలను కూడ తీసుకు వచ్చి, అమ్మవార్లకు సమర్పించారు.
క్యూలైన్ లో చెమటలు కక్కిన మహిళలు:
ఆదివారం వాతావరణం ఎండగా ఉండటంతో ఉక్కబోతతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి వచ్చే క్యూలైన్ లల్లో బోనం ఎత్తుకొని నిల్చున్న మహిళలు చెమట పట్టి అసౌకర్యానికి గురయ్యారు.దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర వరకు సమయం పట్టడంతో మహిళలు ఊసురుమన్నారు.
కాగా ఒక్క బోనం వెంట పోలీసులు ఐదుగురిని మాత్రమే అనుమతించగా, మిగితా వారు ఇతర క్యూలైన్లలో రావాల్సి వచ్చింది. కాగా ఆలయానికి వచ్చిన కొందరు వీఐపీలు అత్యుత్సాహం ప్రదర్శించగా పోలీసులు వారితో వాగ్వివాదానికి దిగారు. మీడియా పాయింట్ వద్ద విలేఖరులు కూర్చోనేందుకు కనీసం కుర్చీలు కూడ లేకపోవడంతో గంటల తరబడి వీరు నిలబడాల్సి వచ్చింది. కొందరు పోలీసులు పాసులున్నప్పటికీ కొందరు మీడియా వారిని లోనికి అనుమతించకపోవడంతో వారు కొంత అసౌకర్యానికి గురయ్యారు.కాగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సారి వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచడటంతో భక్తులకు తాగు నీటి ఇబ్బందులు కలగలేదు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ స్వయంగా ఆలయం వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి తొక్కిసలాట, ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ కనిపించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ...బోనాల వేడుకల సందర్బంగా ఆలయ పరిసరాల్లో బందోబస్తు కోసం మొత్తం 2500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినట్లు తెలిపారు.
ఆలయ ఆవరణలోని 150 సీసీ కెమెరాలను మహాకాళి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి, రౌండ్ ఏ క్లాక్ పర్యవేక్షించినట్లు తెలిపారు. అలాగే లంచ్ తర్వాత ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడ బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు పలు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు ప్రాంరభమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లోని ఆయా ఆలయాల నుంచి సంప్రదాయ బద్దంగా పోట్టెళ్ళతో అమ్మవారి వాహనాన్ని భాజ , భజీంత్రాలతో, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఉజ్జయిని ఆలయానికి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో...
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బన్సీలాల్ పేట్ లోని చారిత్రాక మెట్ల బావి వద్ద నుండి 200 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఒగ్గు డోలు కళాకారులు, పోతరాజులతో ఆటపాటలతో ఉమ్మడి బోనాలతో భారీ ఊరేగింపు సాగింది. ర్యాలీగా వెళ్ళి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈసందర్బంగా ఒగ్గుడోలు కళాకారులు, పోతరాజులు చేసిన విన్యాసాలు, ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ వెన్నెల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
రేపే రంగం (భవిష్యవాణి)
ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడ సోమవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పచ్చికుండపై నిల్చోని స్వర్ణలత భవిష్య వాణి వినిపిస్తారు. ఆ తర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుంది. జూపార్క్ నుంచి తెప్పించిన ఏనుగుపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి, ప్రధాన ఆలయం నుంచి ఆలయ సంప్రదాయనుసారంగా ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు కన్నులపండువగా కొనసాగనుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.
