ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

On
ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుంది
సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి

ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీలేదు

బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాక్కుంటుంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

IMG-20250806-WA0015

హైదరాబాద్ ఆగస్ట్ 06:

తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా సంస్థ ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.

రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుందని,  సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. 

బుధవారం నాడు బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాగృతి ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జాతీయ పతాకం, తెలంగాణ జాగృతి జెండా ఎగరవేశారు.  ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం, బీసీల కోసం ఉద్యమం చేస్తానని ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేవారని గుర్తు చేశారు. ప్రపంచీకరణ, కార్పొరేట్ల నేపథ్యంలో వృత్తి పనులు నాశనమవుతున్న క్రమంలో సామాజిక విప్లవం రావాలి అనే ఆకాంక్షించేవారని, భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ ధ్యైయంగా ఉండాలని చెప్పేవారని, కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో తెలంగాణ జాగృతి పనిచేస్తుందని తెలిపారు. 

నిరహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై తాను చేపట్టిన 72 గంటల పాటు నిరహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ధర్నా కోసమే తన దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. బీసీ బిల్లుల ఆమోదానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలవాలని, గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.

IMG-20250806-WA0014

అటువంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకుండా ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా బీసీ బిడ్డలను మోసం చేస్తున్నట్లేనని సూచించారు. కాంగ్రెస్ దొంగ ధర్నాలు కాదు.... ఫలితం వచ్చే చర్యలు చేపట్టాలి అని అన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కోడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరికి ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లీంల రిజర్వేషన్లు ఉన్నారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వకముందే అందులో ముస్లీం రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఎలా తెలుసు ? అని ప్రశ్నించారు. నాటకాలు ఆడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ బీసీలు బుద్దిచెబుతారని హెచ్చరించారు. అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఈ మేరకు అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ సాంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి

తెలంగాణ సాంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి ఏర్పడిందని, కేసీఆర్ చెప్పిన అనేక అంశాలను ప్రాతిపదికన చేసుకొని వారు చూపిన బాటలో ఉద్యమాలు చేశామని వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన అంశాలను దారిదీపాలుగా, మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్లామని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తిని ముందు తరాల వారికి పంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి సందర్భంలో కచ్చితంగా తెలంగాణ జాగృతి ఇంకా బలంగా పనిచేయాలని, చేసే ప్రతీ పనిలో తెలంగాణ సోయి ఉండాలని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ధర్నాలు చేయడం కాదని, సామాజిక తెలంగాణ అంటే గ్రామ గ్రామాన ప్రతీ ఒక్కరి జీవన శైలిలో మార్పులు తీసుకురావడమని అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను మరింత బలోపేతం చేయడానికి మరిన్ని కమిటీలు వేస్తున్నామని తెలియజేశారు. 

తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాల్లో జాగృతి నాయకులు నవీన్ ఆచారి, వరలక్ష్మీ, రూప్ సింగ్, సంపత్ గౌడ్, మరిపెల్లి మాధవి, కొట్టాల యాదగిరి, రాము యాదవ్, అర్చనా సేనాపతి, శ్రీకాంత్ గౌడ్, లలితా యాదవ్, మహేందర్, లింగం తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి మెట్టుపల్లి ఆగస్ట్ 06:  మెటుపల్లి  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కంతి మోహన్ రెడ్డి, డా. తుల రాజేందర్ కుమార్, బార్ కార్యదర్శులు పి. శ్రీనివాస్, గజెల్లి రామదాస్, శంకర్, సాగర్, గుయ్య సాయి కుమార్, సత్యనారాయణ, రమేష్,దయాకర్ వర్మ, కోలా అశోక్ తదితర న్యాయవాదులు ప్రొ. కొత్తపల్లి జయశంకర్ కు నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర...
Read More...
Local News 

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు   పలు చోట్ల హాజరైన శ్రీగణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్   సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజా మంటలు): కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినం సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఢిల్లీలో టిపిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో పాల్గొంటున్నందున నియోజకవర్గంలో అభిమానులకు, కార్యకర్తలకు...
Read More...
Local News  State News 

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి జాడే లేదు..    బీటలు వారిన శిలాఫలకం, ఊడిన గ్రానైట్ రాళ్ళు.. సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు)  : తెలంగాణ రెండోదశ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గాంధీ ఆసుపత్రి పాలనయంత్రాంగం వైద్యాధికారులు మరిచారు. ఆసుపత్రి  మెయిన్ బిల్డింగ్ కు వెళ్ళే గేట్ వద్దే ఉన్న జయశంకర్ విగ్రహం...
Read More...
Local News 

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్  కుమార్ సతీమణి కాంత కుమారి (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 06 (ప్రజా మంటలు):      అలెగ్జాండర్ రాజుగా పాలిస్తున్న కాలంలో పురుషోత్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు పురుషోత్తముడు భార్య తమను రక్షించాలని  ఆమె తన కొంగు చివరి అంచును చింపి అలెగ్జాండర్ కు  రాఖీల కడుతుంది. ఈ క్రమంలో గొల్లపల్లి...
Read More...
Local News 

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్  తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్   తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)       ఆచార్య శ్రీ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా  తొలి జడ్పీ చైర్ పర్సన్  దావ వసంతసురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ లోని 4కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జగిత్యాల ఆగస్టు 6 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  అరిగెల అశోక్  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్  జయశంకర్  చాలా చురుకుగా పాల్గొని తెలంగాణ...
Read More...
Local News 

పెగడపల్లి  మండల కేంద్రంలోని  తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

పెగడపల్లి  మండల కేంద్రంలోని  తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.     పెగడపల్లి ఆగస్ట్ 8 (ప్రజా మంటలు)బుధవారం రోజున జగిత్యాల జిల్లా పెగడపల్లి.మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్  పాఠశాలను జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్   తనిఖీ చేసి   పరిశీలించి.  పాఠశాల విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. విద్యార్థులకు  నాణ్యత మైన విద్యను అందించాలి. విద్యార్థులతో కలిసి కూర్చొని విద్యా బోధనను పరిశీలించిన జిల్లా...
Read More...
Local News 

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్                                                                                                                                         జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)                                                                                                                                                                                         బుధవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ లో గల ఈ.వీ.ఎం గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ.వి.ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలా తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా  ఈవీఎం గోడౌన్...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త . ఆచార్య జయశంకర్  జయంతి వేడుకలను  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రొ. జయశంకర్ జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో ముందుగా   డిపిఓ కార్యాలయ  ఏ ఓ శశికళా   ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి...
Read More...
Local News  State News 

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుంది సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీలేదు బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాక్కుంటుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఆగస్ట్...
Read More...
Local News  State News  Crime 

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్ 22 వేల లంచం తీసుకుంటూ,రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ DTO బద్రు నాయక్  కోరుట్ల జెసిబి ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల సోదాలు జగిత్యాల ఆగస్ట్ 06: జగిత్యాల్ జిల్లా రవాణా అధికారి (DTO) బానోత్ భద్రు నాయక్ ని ACB కరీంనగర్ యూనిట్ తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకుంది. తన వాహన...
Read More...
Local News 

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు నేషనల్ వాస్క్యులర్ డే ...కిమ్స్సన్ షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్ థాన్, అవేర్నేస్       - పాల్గొన్న సినీ నటుడు రాజీవ్ కనకాల    సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :    త్వరితంగా గుర్తించి, సకాలంలో  సరైన వైద్య చికిత్సలు తీసుకుంటే, వాస్క్యులర్ తో బాధపడుతున్న వారిలో   80శాతం వరకు అంప్యూటేషన్‌ (చేతులు, కాళ్ళు తీసివేయడం) లను నివారించవచ్చునని...
Read More...