"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"
గురుపూజ, స్నేహానికి అర్పణగా ప్రత్యేక కార్యక్రమం
భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :
ముల్కనూర్ లోని విశ్వశాంతి విద్యాలయం 2010-11 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మళ్లీ ఒకచోట చేరి గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపి, మిత్రుల మధ్య మధురానుభూతులు పంచుకున్నారు. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః...” శ్లోకంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, జీవితానికి మార్గదర్శకులైన అధ్యాపకులకు పూర్వ విద్యార్థులు కృతజ్ఞతా పూర్వక నమస్సులు అర్పించారు. వారికి గుర్తుగా సన్మానాలు నిర్వహించారు. స్నేహానికి అంకితంగా "మీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్న, నీ కన్నీటి విలువ తెలిసిన మిత్రుడు మిన్న" అనే మాటలతో మిత్రుల మధ్య అనుబంధం చాటి చెప్పారు.
"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా" అనే భావోద్వేగమయమైన సందేశంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, మధుర జ్ఞాపకాలలో మునిగి తేలారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లపల్లి మహేందర్, దస్తరి ఉమామహేశ్వర్, చెప్యాల గోపాల్ రెడ్డి, తిరుపతాచారి, అనగాని శ్రీనివాస్, ఎల్కపల్లి శ్రీనివాస్, మొగిలి, రాములు, ఈశ్వర్, గుడికందుల విజయ్, పద్మ, గీత, జయ, అనిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
