చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం
సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ చిలకలగూడ లోని కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సర్వసభ్య సమావేశం ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఆషాడ బోనాల ఉత్సవాల నేపద్యంలో భక్తుల సౌకర్యార్థమై చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై హక్కుదారులు చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఏడాది ఆలయ హక్కుదారులు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావుగౌడ్ ను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ హక్కుదారులు పేర్కొన్నారు. ఈసందర్బంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీతాఫల్మండి ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘ ప్రెసిడెట్ గరికపోగుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కట్టమైసమ్మ ఆలయ హక్కుదారులకు ఘనంగా సన్మానం జరిగింది. ఆలయ హక్కుదారులతో కలసి అన్ని శాఖల అధికారులు, స్వచ్చందసంస్థల సహాకారంతో ఈ సారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పల్లె రవికుమార్, హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
