ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి ఉద్యమకారుల ఫోరం దీక్షా శిబిరంలో జెఎసి నాయకుల డిమాండ్
జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం శాంతి యుత దీక్షలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ జెఎసి నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ లు సందర్శించారు. దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియ పరచారు.
దీక్షా శిబిరంలో కూర్చొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమకారులకు చేస్తున్న అన్యాయాలను, ఉద్యమ ఆకాంక్షలను ఈ చర్చించారు. దీక్షా శిబిరం ను ఉద్దేశించి చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ లు మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమకారులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఉద్యమం పేరుతో గద్దె నెక్కిన గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదన్నారు.
ఉద్యమకారులను అండగా ఉంచుకొని గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేటికీ ఉద్యమ కారులను గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతగానో పోరాటాలు చేశామని, ఉన్న ఉపాధిని పోగొట్టుకొని, భార్యా పిల్లలను సైతం వదిలి పెట్టీ రోడ్లెక్కి ఉద్యమాలు చేయడంతోనే తెలంగాణ సాధ్యం అయిందన్నారు. అలాంటి ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు గానీ, తగు ప్రభుత్వ సాయం గానీ అందించక పోవడం శోచ నీయం అన్నారు. గత ఏడాది చేపట్టిన ప్రజా పాలనలో ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం నేటికీ ఆ ఊసే ఎత్తక పోవడం బాధాకరం అన్నారు.
ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పెన్షన్, ఇంటి స్థలాలు, గుర్తింపు కార్డుకు ఇవ్వాలని, ఆ స్థలాలలో ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేసి ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, నామినేటెడ్ పదవులలో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
