ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి
భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :
ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సహకారోద్యమానికి ప్రాణం పోసిన కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39వ వర్ధంతిని ఆదివారం ఉదయం సంఘ ఆవరణలో శ్రద్ధాంజలుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంఘ ప్రస్తుత అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో సంఘ సీనియర్ సభ్యులు కటకం లక్ష్మీనారాయణ (మల్లారం), మాడిశెట్టి తారాబాయి (కొత్తపల్లి) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ స్థాపనలో కీలకపాత్ర పోషించిన విశ్వనాథ రెడ్డి సేవలు ఈ సందర్భంగా ప్రముఖులచే స్మరించబడ్డాయి. సహకార రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం సంఘ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘ జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు కడారి ఆదాం, కార్యవర్గ సభ్యులు కూన కనుకయ్య, మారుపాటి జయపాల్ రెడ్డి, కంకల భాగ్య, గజ్జి వీరయ్య, అంబాల రాములు, ఈర్ల మూగయ్య, బేల కనుకమ్మ, కంది రవీందర్ రెడ్డి, కర్రె మహేందర్, మండ శ్రీనివాస్, చెవ్వల్ల బుచ్చయ్య, గుగ్లోతు బాషు, బొల్లపెల్లి వీరారెడ్డి, బొల్లంపెల్లి కుమారస్వామి, గనవేన శ్రీనివాస్, గుర్రాల భాస్కర్ రెడ్డి, కాసిరెడ్డి వసంత తదితర సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
