శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ
జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)
పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు.
హుండీ తాళం తెరువ రాకపోవడంతో వదిలివేశారు. గర్భాలయం సెంట్రల్ లాక్ తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇనుప రాడ్ తో తాళాలు పగలగొట్టినట్లుగా ఇనుపరాడు ఆలయ ఆవరణలో లభ్యమయింది.
ఇదిలా ఉండగా ఆలయ అర్చకులు ఉదయం ఆలయం తెరవడానికి వెళ్ళినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే ఆలయ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజ్ కు సమాచారం అందించారు.
ఆలయాన్ని చేరుకున్న ఆలయ అధ్యక్షులు స్థానిక పోలీసులకు100 ద్వారా ఫోన్ చేశారు . వెంటనే క్లూస్ టీం ఆలయానికి చేరుకొని పగిలిన తాళాలను ద్వారమును హుండీని సాంకేతిక సహాయంతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ (చింతకుంట) మరియు ఆలయాన్ని ఆనుకొని లారీలు నిలుపుతున్నారని దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా పలుమార్లు ఆలయంలో చోరీలు కూడా జరిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా లారీలను ఆలయ ప్రాంతంలో మరియు ఐలమ్మ బతుకమ్మ విగ్రహాల వద్ద నిలుపకుండా చూడాలని అధికారులకు ఆలయ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*

ఇరాన్ పై ఇజ్రాయి క్షిపణి దాడులు రివల్యూషనరి గార్డ్స్ చీఫ్, ఇద్దరు న్యూక్లియర్ శాస్త్రవేత్తల మృతి
.jpeg)
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
.jpeg)