శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ
జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)
పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు.
హుండీ తాళం తెరువ రాకపోవడంతో వదిలివేశారు. గర్భాలయం సెంట్రల్ లాక్ తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇనుప రాడ్ తో తాళాలు పగలగొట్టినట్లుగా ఇనుపరాడు ఆలయ ఆవరణలో లభ్యమయింది.
ఇదిలా ఉండగా ఆలయ అర్చకులు ఉదయం ఆలయం తెరవడానికి వెళ్ళినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడం చూసి వెంటనే ఆలయ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజ్ కు సమాచారం అందించారు.
ఆలయాన్ని చేరుకున్న ఆలయ అధ్యక్షులు స్థానిక పోలీసులకు100 ద్వారా ఫోన్ చేశారు . వెంటనే క్లూస్ టీం ఆలయానికి చేరుకొని పగిలిన తాళాలను ద్వారమును హుండీని సాంకేతిక సహాయంతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ (చింతకుంట) మరియు ఆలయాన్ని ఆనుకొని లారీలు నిలుపుతున్నారని దీంతో అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా పలుమార్లు ఆలయంలో చోరీలు కూడా జరిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా లారీలను ఆలయ ప్రాంతంలో మరియు ఐలమ్మ బతుకమ్మ విగ్రహాల వద్ద నిలుపకుండా చూడాలని అధికారులకు ఆలయ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
