సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

On
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

 ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు

 (రామకిష్టయ్య సంగనభట్ల...
     9440595494)

కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి ఏదన్నా తింటారు. సంకట చతుర్థి ప్రాముఖ్యత భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణంలోనూ చెప్పబడింది.  సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడు యుధిష్టరునికి వివరించాడు. సంకట అంటే కష్టములు, ఇబ్బందులు, సమస్యలను హర అంటే హరించేది అని అర్థం.

ఋగ్వేదంలో గణపతి వేదాలు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వవ్యాపక భక్తుల ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని, సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త హర్త అని ఆనందమయుడని చిన్మయుడని, లంబోదరుడని, శూర్ప కర్ణుడు రక్తం గుడిగా అభివర్ణించారు. అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకట హరుడుగా  పూజించడం అనాదిగా వస్తున్నదే. సంకటహరుని పూజించడానికి కృష్ణ పక్ష చతుర్థి ప్రసిద్ధి. సంకట హర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు, ధర్మ రాజుకు వివరించినట్లు పురాణ కథనం.

 

సంకట హర చతుర్థి ప్రత్యేకత

కృష్ణ పక్ష చతుర్థి సంకష్టహర, సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు దినమంతా ఉపవాస ముండి, సాయంత్రం , నిశి పూజ, చంద్రదర్శనానంతరం భోజనాలు చేయడం, నిర్దేశిత ఆచారం. ఇలా చేస్తే సకల కష్టాలు, సంకటాలు తొలగి పోయి, సంకట నాశకుడైన విఘ్న నాయకుని కృపకు పాత్రులు, జన్మరాహిత్యం , మోక్షం సిద్ధించి, సప్త జన్మలు అవసరం లేకనే శాశ్వత గణేశ లోక ప్రాప్తి కలుగనున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. తలపెట్టిన పనులకు విఘ్నాలు కలుగుతూ అశాంతి, మానసిక, శారీరిక రుగ్మతలు, రుణ బాధలు, అనేక కష్టాలు కలుగుతున్నప్పుడు దుష్టగ్రహ పీడన నివారణ కొరకై ప్రతి నెలా సంకష్టహర చవితి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజలు జరపడం సంప్రదాయం.
సంకట హర చతుర్థి నాడు కలశ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా గణపతి అధర్వ శీర్ష పూజలు, అభిషేకం, అష్టోత్తర అర్చనలు, నివేదన, హారతి, మంత్రపుష్పం, నీరాజన, తీర్థ ప్రసాద వితరణాది సాంప్రదాయక క్రతువులను నిర్వహించడం, భక్తుల గోత్రనామాదులతో ప్రత్యేక అర్చనలు, గణపతి ఉపనిషత్ యుక్త అభిషేకా దులను నిర్వహించు కోవడం, భక్తులు తమ స్వగృహాల లోనూ గణపతి పూజ  లొనరించి రాత్రి చంద్ర దర్శనానంతరం అరగించడం సనాతన సంప్రదాయం. సంకష్ట చతుర్థి నాడు వినాయక వ్రతాచరణ ద్వారా కుజ దోష సమస్యలు తొలగి పోగలవని, సంకటాలన్ని తొలిగి సఫలత లభించగలదని వరం ప్రసాదించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు

శుక్ర వారం  కృష్ణ పక్ష చతుర్థి సందర్భంగా 
ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీరామ లింగేశ్వర ఆలయ సంబంధిత ఈశాన్య గణపతికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఉపనిషత్తులతో అబిషేకం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు అద్యక్షులు జక్కు రవీందర్, సభ్యులు, మాజి దేవస్థానం అధ్యక్షులు సంగన భట్ల దినేష్,  సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , స్థానిక వేదపండితులు మధు రామ శర్మ , అర్చకులు  విశ్వనాథ శర్మ బొజ్జ సంపత్ కుమార్ రాజగోపాల్, ద్యావళ్ల సాయికుమార్ అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.  మెట్పల్లి జూలై 1(ప్రజా మంటలు)   మంగళవారం రోజున మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్  తెలిపారు.   విద్యార్థులకు 15 రోజులలో గాను తాత్కాలికంగా భవన పనులు ఏర్పాట్లు చేయాలని  అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   కలెక్టర్
Read More...
Local News 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం: 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:  కొత్తపల్లి గ్రామం సాయి నగర్ వాసులుగా గుర్తింపు
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,...
Read More...
Local News 

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు వైద్యులు… కనిపించే దేవుళ్ళు భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం భీమదేవరపల్లి, జూలై 1(ప్రజామంటలు) : వైద్యులు కనిపించే దేవుళ్ళు అని వినిపించే మాట, ప్రస్తుత కాలంలో మరింత మరింత స్పష్టంగా రుజువవుతోంది. రోగుల ప్రాణాలను కాపాడుతూ తన సేవలతో విశేష గుర్తింపు పొందుతున్న వైద్యులను గౌరవించేందుకు ప్రతి ఏడాది జూలై 1న...
Read More...
Local News 

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు హైదరాబాద్ జూలై 01(ప్రజా మంటలు): మీడియాలో నివేదించబడిన రెండు తీవ్రమైన సంఘటనలను  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్వయంగా స్వీకరించింది. మొదటి కేసులో, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 30.06.2025న జరిగిన భారీ పేలుడు మరియు అగ్నిప్రమాదంలో దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా కార్మికులు గాయపడ్డారని,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్ జూలై 0 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యమయింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు... గాంధీ ఎమర్జెన్సీ బ్లాక్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్ లో పడి ఉన్న దాదాపు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని సెక్యూరిటీ సిబ్బంది చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం...
Read More...
Local News 

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత 

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత  హైదరాబాద్ జూన్ 30( ప్రజా మంటలు) మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి,  శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవము పురస్కరించుకొని హైదరాబాద్ మల్లాపూర్ లోని విఎన్ఆర్ గార్డెన్లో ఐదు రోజులపాటు శత చండీ యాగం ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును...
Read More...
Local News 

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత సారంగాపూర్ జూన్ 30 (ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన పెంబట్ల కురుమ సంఘం సభ్యులు.    సారంగాపూర్ మండల పెంబట్ల గ్రామంలో బీరయ్య గుడి అభివృద్ధి పనుల నిమిత్తం సిజిఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు కాగా పెంబట్ల కుర్మ సంఘ సభ్యులకు 12ఈ...
Read More...
Local News 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం. 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.  (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 30: క్యాన్సర్ వ్యాధితో  బాధపడుతున్న ఓ నిరుపేద  బాలుడి వైద్య ఖర్చులకోసం ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, గూడూరు గ్రామానికి చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతుల  కుమారుడు రిత్విక్...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ జూన్ 30(  ప్రజా మంటలు    ) మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 48 వేల రూపాయల విలువగల చెక్కులను,31 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 31 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ...
Read More...
Local News 

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము,

 మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము, గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు): ఉద్యోగ విరమణ పదవికి మాత్రమే పదవి విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు చేయవచ్చని జిల్లా విద్యాధికారి రాము అన్నారు గొల్లపల్లి మండల కేంద్రంలో భూస జమునా దేవి గెజిటెడ్ హెడ్మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట ఇన్చార్జ్ మండల విద్యాధికారి గొల్లపల్లి, ఉద్యోగ విరమణ సన్మాన...
Read More...
Local News 

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు):  కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో  ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య కు ప్రయత్నించిన ఘటన సోమవారం ధర్మపురి పట్టణంలో కలకలం రేపింది వ్యక్తి ఆత్మహత్యయత్నానికి సంబందించిన సమాచారం అందుకున్న ధర్మపురి పోలీస్ సీఐ  రామ్ నర్సింహా రెడ్డి హుటాహుటిన తన సిబ్బంది తో...
Read More...