ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు
మృతదేహం తరలింపు ప్రక్రియలో పురోగతి
- మరో రెండు రోజుల్లో ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు చేరనున్న మృతదేహం
జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) ఈ నెల 16న ఇజ్రాయిల్లో గుండె సంబంధిత అనారోగ్యంతో మరణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో అవరోధాలు ఏర్పడ్డాయి. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే పనిలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ సహాయంతో వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ తాజా మాజీ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి - లక్ష్మణ్, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇజ్రాయిల్ లోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరపడం, ఇజ్రాయిల్ లోని తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సోమ రవి సమన్వయంతో మృతదేహం తరలింపు ప్రక్రియ వేగవంతం అయ్యింది.
రవీందర్కు బీమా పాలసీ లేకపోవడం వల్ల మృతదేహ రవాణా ఖర్చులను భారత రాయబార కార్యాలయం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట 'ఆపరేషన్ సింధు'లో భాగంగా ఆయన మృతదేహాన్ని విమాన మార్గంలో తరలించేందుకు ప్రయత్నించారు. అయితే కొన్ని ఆంక్షలు ఎదురవ్వడంతో అది వీలు కాలేదు. యుద్ధ పరిస్థితుల వలన ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పుడు కాల్పుల విరమణ నేపథ్యంలో మృతదేహం తరలింపుకు మార్గం సుగమం సులువైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో, రవీందర్ మృతదేహం కలిగిన శవపేటికను రోడ్డు మార్గంలో ఇజ్రాయిల్ నుంచి జోర్డాన్ రాజధాని అమ్మాన్కు తరలించి, అక్కడి నుండి విమాన మార్గంలో ఢిల్లీ, అనంతరం హైదరాబాద్కు పంపేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

#Draft: Add Your Title

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి
