జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు

On
జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు


సామాజిక తత్వవేత్త,యుగకర్త 
తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ 
బి ఎస్ రాములు తీవ్ర సంతాపం!
--//---
        ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు  ారాయణ  సార్ అని పిలుస్తారు. ఆయన ది  కోరుట్ల సమీపంలోని కల్లూరు  గ్రామం పక్కన గల పల్లె. దాన్ని పల్లె అని పిలుస్తారు. . అందువల్ల పల్లెమీది నారాయణ, కల్లూరు  నారాయణ అని కూడా పిలుస్తారు. ఆయన పూర్తిపేరు పండుగ నారాయణ.  ఆ పల్లె పేరు సర్పరాజ్ పల్లె అని ఎవరికీ పెద్దగా తెలియదు. వారి మృతికి తీవ్ర సంతాపం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.  

   నారాయణ ప్రజల మనిషి. 
————————————
కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలి తరం నక్సలైట్ నాయకులలో నారాయణ సార్ ఒకరు. 
మూడు నెలలుగా లివర్ అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో 
 జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ అయ్యి కోలుకున్నారు తిరిగి లీక్ కావడం తో  మేనెల 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. వారికి భార్య ఒక కొడుకు ఒక బిడ్డ.  1968 లో పయూసి చేసిన నారాయణ కొంత కాలం ప్రయివేటు బడి నడిపారు. ఆ వెంటనే  ఉద్యమంలో ేరారు.  ఆయన వయస్సు 75 ఏళ్లు .  ఈ రోజు   ుక్రవారం 16      మధ్యాహ్నం అంత్య క్రియలు . 
 పి నారాయణ చరిత్ర నిర్మాత
—————————-

       పి నారాయణ సార్ ఒక చరిత్ర నిర్మాత. నక్సలైట్ ఉద్యమం తొలి స్థానిక తొలి నాయకత్వంగా
ప్రసిద్ది చెందారు. పల్లెల్లో వేలాది పల్లె వాసుల్లో విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో వారి జ్ఞాపకాలు , చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి. ఆయన అడుగు జాడలలో నడిచిన రైతుకూలీ లు, యువతరం వారి ధైర్యాన్ని  చూసిన ప్రజలు భూస్వాములు , ఉద్యమ సీనియర్  నాయకత్వం మరిచి పోలేరు. 

  వర్గ శతృ నిర్మూలనతో ప్రారంభించి 
——————————————
 పండుగ నారాయణ సార్  వర్గ శతృ నిర్మూలనతో అనేక సంఘటనల్లో ప్రత్యక్ష గా పరోక్షంగా పాల్గొనడం .. మొదలు కొని ఎమర్జెన్నీలో రహస్య జీవితం గడిపి ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ కేంద్రం లో అధికారంలోకి రావడం తో బహిరంగ ప్రజా ఉద్యమాల నిర్మాణం లో తల మునకలయ్యారు.  విద్యార్థుల యువకుల విలేజ్ క్యాంపెయిన్ తో జగిత్యాల పల్లెలు భూస్వాములకు వ్యతిరేకంగా కదిల బారాయి. 1978 జులై 17 ఏర్పాటు చేసిన రైతుకూలీ సంఘం మహాసభ జగిత్యాల జైత్రయాత్ర గా ప్రసిద్ది పొందింది. దాని వెనక ఉన్న నిర్మాతల్లో పి నారాయణ ప్రముఖులు. జగిత్యాల జైత్రయాత్ర యాత్రతో జగిత్యాల సిరిసిల్ల తాలూకా లు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటింప బడ్డాయి.
    
నాకు స్పూర్తి నిచ్చిన వాడు
 —————————-
      నేను విప్లవోద్యమంలోకి రావడానికి స్పూర్తి నిచ్చిన పి నారాయణ మా చినమామ అల్లుడు.    సడ్డకుడుగా పరిచయం. మా శ్యామల మేనత్త కొడుకు. మాకు  1973 లో పెళ్లయ్యాక సెలవుల్లో  నారాయణ తో అనేక చర్చలు జరిగాయి. అలా భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల పట్ల ఆకర్షితుడినయ్యాను. పౌరహక్కుల నాయకుడు జాప్ లక్ష్మా రెడ్డి గారు నారాయణ సాహసాలను శతృవు నుండి తృటిలో తప్పించుకున్న సంఘటనలను చెప్పి ప్రశంసిస్తుంటే వాడు.
 
నారాయణ  వాస్తవికత దృష్టి
————————— ——-
         జగిత్యాల జగిత్యాల జైత్రయాత్ర జరిగిన ఉత్సాహం తో పార్టీ అగ్ర నాయకులు ఉత్తర తెలంగాణ, అటుతర్వాత దండకారణ్యం గెరిల్లా జోన్ ప్రతి పారించారు.  నారాయణ పల్లెలో పుట్టి పల్లెలో పెరిగాడు. నారాయణ గారిది వాస్తవిక దృష్టి. దొరలు గుంజుతున్న భూములతో సహా భూములు ఇప్పిస్తామని జగిత్యాల సభకు రమ్మని పిలుపు విని వచ్చిన రైతుకూలీలు వారు. అందువల్ల  ప్రజల చైతన్యంలో అంత సీన్ లేదని, భూములు పంచుతామంటే ఆశతో వచ్చిన ప్రజలని స్థానిక ఎన్నికల్లో పాల్గొని మన శక్తి బలం సమకూర్చుకోవాసని ఆశించారు.
 అందుకు  ా  పెద్దమామ చెన్న రాజ గంగారాం నాయకత్వంలో 1962 లో సాగించిన ఉద్యమాలతో ఊరి దొర పారి పోయి అదిలాబాద్ లో స్థిరపడి అక్కడే చనిపోయాడని  గొప్ప పోరాట స్పూర్తి.  ఆ కాలంలోనే దొరల ు ఎదిరించి ఒక బీసీని  సర్పంచ్ గా ఎన్నుకున్నారు.  ఇలానే 
పల్లెలన్నిటా ఈ సామాజిక పరిణామాలు, స్థానిక అధికార మార్పిడి జరగాలని నారాయణ గారు 
పార్టీ ముందుంచారు. 
      పార్టీ  అగ్ర నాయకత్వం స్థానికేతర నాయకత్వం.  ఈ చరిత్ర పరిణామం అర్థం చేసుకోలేదు . వారు గెరిల్లా జోన్ , ఎన్నికల బహిష్కరణ లకు ప్రాధాన్యత నిచ్చారు.. భిన్నాభిప్రాయాలు గల నారాయణ  సీనియారిటీ ను కాదని ఇతరులకు నాయకత్వం అప్పగించడంతో  కినుక వహించారు. అనేక కేసుల  కారణంగా జైలు జీవితం గడిపి 1984 ఫిబ్రవరి లో బయటకు వచ్చార
 
పార్టీ వదిలినా పాత పగలు పోలేదు. 
———————————————-
 పార్టీ వదిలినా కేసులు కొట్టేసినా  భూస్వాముల పాత పగలు పోలేదు. ఎపుడు ఎవరు చంపుతారో తెలియదు. రహస్య జీవితమే అనివార్యం అయింది. కుటుంబం ను తీసుకొని నారాయణ హైదరాబాద్ చేరుకున్నారు. సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిరోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.

 తిరిగి పల్లెకు చేరిన నారాయణ కుటుంబం
——————————————————
      సిటీలో ఉండి సాధించింది లేదు. సంపాదించింది లేదు అని కొన్నాళ్లకు తిరిగి స్వంత ఊరుకు చేరుకున్నారు. ఆయన ఉద్యమాన్ని వదిలినా , ఆయన ఆశయాలకు భిన్నంగా ఉద్యమం సాగినా ఆయనపై భూస్వామ్య, పాలక వర్గాల నిర్బంధాలు కొన సాగుతూనే వచ్చాయి.  
         
 జగిత్యాల జైత్ర యాత్ర చరిత్రలో నిలిచి వున్నంత కాలం ఆయన పేరు నిలిచి వుంటుంది
—————————————-
ఆయన అమర వీరుల జాబితాలో లేక పోవచ్చు. 
కాని నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి విత్తనాలు  వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా నాయకుడిగా  నారాయణను చరిత్ర గుర్తుంచుకుంటుంది. నారాయణ గారు  అనుకున్న 
. తీరులో ఉద్యమాలు సాగితే  గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అొదికార మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. స్థానిక పరిస్థితులు తెలియని  స్థానికేతర నాయకత్వం వల్ల తెలంగాణ దశాబ్దాలుగా నిర్బంధాల కింద నలిగి పోయిందని కొందరు సీనియర్లు భావిస్తుంటారు. 
       తనదైన చరిత్ర నిలుపుకున్న స్వంత ఆలోచనలు స్వంత వ్యక్తిత్వం గల పి నారాయణ సార్ జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి వుంటారు.
   —- బి ఎస్ రాములు 
 8331966987
16 మే 2025

Tags

More News...

Local News 

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు      

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు           -సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు           జగిత్యాల జులై 01 (ప్రజా మంటలు): వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు  అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో...
Read More...
State News 

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత పటాన్చెరువు జూలై 01 (ప్రజా మంటలు): సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధితుల తో, అక్కడి డాక్టర్లతో ఆమె మాట్లాడరు. ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలను...
Read More...
Local News 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్  సికింద్రాబాద్  జూలై01 (ప్రజామంటలు): :  మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు  రఘునందన్ రావు ను బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం  ఆయన పలువురు బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్ల  ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయన...
Read More...
Local News 

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు సికింద్రాబాద్ జూలై 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి మేళా తాళాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఘటము కళాసిగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమ,పసుపులు...
Read More...
Local News  State News 

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : పాశమైలారం ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్...
Read More...
Local News 

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, జూలై 01 ( ప్రజామంటలు) : డాక్టర్స్ డే సందర్భంగా భారత రత్న డాక్టర్ బీ.సీ రాయ్ ని  స్మరిస్తూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి,ఇతర వైద్యులు ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులు గా ఉండడం అత్యంత అదృష్టం గా...
Read More...
State News 

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు)::పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దోమన్ యాదవ్ పాట్నా యూనివర్శిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు....
Read More...
Local News 

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని చుట్టాల బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,ఆపదలో ఉన్న వారి...
Read More...
Local News 

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత అన్నారు   జగిత్యాల పట్టణంలో మంగళవారం జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో నాయకులతో కలిసి పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
Read More...
Local News 

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు  సికింద్రాబాద్, జూలై01 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున...
Read More...
Local News 

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...! మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు గొల్లపల్లి (రాయికల్) జులై 01 (ప్రజా మంటలు): తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ సురేందర్,డాక్టర్...
Read More...
Local News 

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా ర్ జగిత్యాల జూలై 1 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఈ...
Read More...