న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి
న్యాయవాదులపై వరస దాడులపై నిరసన
*సికింద్రాబాద్ కోర్టు విధుల బహిష్కరించిన న్యాయవాదులు
సికింద్రాబాద్ ఎప్రిల్ 07 (ప్రజామంటలు) :
తెలంగాణ రాష్ర్టంలో న్యాయవాదులపై దాడులు వరసగా జరుగుతునే ఉన్నాయని, న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని సికింద్రాబాద్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రాజశేఖర్ రెడ్డి కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ న్యాయవాది మహ్మద్ ముస్తాఫా అలీ పై ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కత్తులతో దాడి జరిగిందని, ఇటీవల కాలంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన యక్తం చేశారు. న్యాయం కోసం కోర్టులో వాదనలు వినిపిస్తున్న తమకు రక్షణ లేదని, న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఉపాద్యక్షుడు మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్, మహేశ్వరీ, సంతోష్ కుమార్, సమత, అనిత, సంజయ్, పానవి, మల్లేశ్, మురళిధర్, స్వామి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు
