పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు
జగిత్యాల ఏప్రిల్ 3(ప్రజా మంటలు)
తేదీ 14-06-2024 రోజున బీర్పూర్ గ్రామ శివారులో రోళ్ల వాగు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపినారని, అప్పటి బీర్పూర్ పంచాయితీ కార్యదర్శి పుర్రే చిన్న నర్సయ్య బీర్పూర్ పోలీసు స్టేషన్ లో ధరకాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తులో భాగంగా, మొదట అనుమానంతో మృతుడి యొక్క కుటుంబ సభ్యులయిన చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణకు మృతదేహాన్ని చూపించినా కానీ వారు ఆ శవం అతనిది కాదని ఒక అనాధ శవంలాగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మృతుడి యొక్క ఎముక భాగాలను డి ఎన్ ఏ పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ కు పంపి, చనిపోయిన వ్యక్తి అంకం లక్ష్మీనారాయణ, తండ్రి పేరు రాజం, 55 సంవత్సరాలు, నర్సింహులపల్లి గ్రామం గా గుర్తించి, ఈ విషయం నిందితులకు తెలియచేసినా కానీ వారిలో ఎలాంటి భాద లేకపోవడం మరియు మృతుడికి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించాల్సిన కర్మ కాండలు జరిపించలేదు.
, మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ప్రవర్తన మీద అనుమానం ఉండటం తో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట వారు నేరం అంగీకరించలేదు.
ఇట్టి వారికి ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఆధునాతన సాంకేతిక పరిజ్ణానం పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్ట్ కు మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ను పంపి ఆ టెస్ట్ ఫలితాల ద్వారా అంకం లక్ష్మినారాయణను హత్య చేసింది వారేనని నిర్ధారించుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు అంకం సాయికుమార్ తన తండ్రి అంకం లక్ష్మీనారాయణ రోజూ తాగి వచ్చి, ఏ పని లేకుండా గొడవ చేస్తున్నాడని ఉద్దేశంతో, మృతుడి యొక్క కొడుకు మరియు తన భార్య ఇద్దరు కలిసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చినారని నేరం ఒప్పుకోగా వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు.
ఈకేసును ధర్యాప్తు అధికారి పరిశోధించిన జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వై కృష్ణారెడ్డి ని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు బీసీ సంఘం వారిచే ఘనంగా సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ లను బీసీ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోగురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి ముసి పట్ల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, బిసిల సమస్యలపై దృష్టిసారించి చేతి వృత్తుల వారికి ఉపాధి... హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
హనుమకొండ చెరబండ రాజు నగర్లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.
SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర... బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్జెట్కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ / కోల్కతా ఫిబ్రవరి 19:
భద్రతా రుసుములు, ఎయిర్స్పేస్ వినియోగానికి సంబంధించిన బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని వినియోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో కోల్కతా నుంచి ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే కొన్ని విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
ప్రధానంగా కోల్కతా–గువాహటి, కోల్కతా–ఇంఫాల్ వంటి రూట్లలో... ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు
అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
హెరిటేజ్... జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఫిబ్రవరి 19 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ని,అదనపు కలెక్టర్ బి ఎస్ లత,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రాజ గౌడ్ ని వారి ఛాంబర్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి... విజయకాంత్.డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక
చెన్నై, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డీఎంకే కూటమిలో చేరని డీఎండీకే, తొలిసారిగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేయనుంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్కు సాధికారత సాధనంగా మారాలి
న్యూఢిల్లీ ఫిబ్రవరి 19:
కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఏఐ ఇంపాక్ట్ కాన్క్లేవ్లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను... బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు... మూడు టీ20 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్
అహ్మదాబాద్ ఫిబ్రవరి 18:
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
1️⃣ భారత్ – అమెరికా
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం
ఎవరి బౌలింగ్లో: షాడ్లీ వాన్ షాల్క్విక్
ఎన్ని బంతులు:... ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్కు బ్రిటిష్ పౌరుడు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు.
రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత... చంచల్గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టై సుమారు 90 రోజులుగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో రవిని చంచల్గూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి రవిపై మొత్తం ఐదు... నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ నెలవంక భారత్లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.... 