పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు
జగిత్యాల ఏప్రిల్ 3(ప్రజా మంటలు)
తేదీ 14-06-2024 రోజున బీర్పూర్ గ్రామ శివారులో రోళ్ల వాగు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపినారని, అప్పటి బీర్పూర్ పంచాయితీ కార్యదర్శి పుర్రే చిన్న నర్సయ్య బీర్పూర్ పోలీసు స్టేషన్ లో ధరకాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తులో భాగంగా, మొదట అనుమానంతో మృతుడి యొక్క కుటుంబ సభ్యులయిన చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణకు మృతదేహాన్ని చూపించినా కానీ వారు ఆ శవం అతనిది కాదని ఒక అనాధ శవంలాగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మృతుడి యొక్క ఎముక భాగాలను డి ఎన్ ఏ పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ కు పంపి, చనిపోయిన వ్యక్తి అంకం లక్ష్మీనారాయణ, తండ్రి పేరు రాజం, 55 సంవత్సరాలు, నర్సింహులపల్లి గ్రామం గా గుర్తించి, ఈ విషయం నిందితులకు తెలియచేసినా కానీ వారిలో ఎలాంటి భాద లేకపోవడం మరియు మృతుడికి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించాల్సిన కర్మ కాండలు జరిపించలేదు.
, మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ప్రవర్తన మీద అనుమానం ఉండటం తో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట వారు నేరం అంగీకరించలేదు.
ఇట్టి వారికి ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఆధునాతన సాంకేతిక పరిజ్ణానం పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్ట్ కు మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ను పంపి ఆ టెస్ట్ ఫలితాల ద్వారా అంకం లక్ష్మినారాయణను హత్య చేసింది వారేనని నిర్ధారించుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు అంకం సాయికుమార్ తన తండ్రి అంకం లక్ష్మీనారాయణ రోజూ తాగి వచ్చి, ఏ పని లేకుండా గొడవ చేస్తున్నాడని ఉద్దేశంతో, మృతుడి యొక్క కొడుకు మరియు తన భార్య ఇద్దరు కలిసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చినారని నేరం ఒప్పుకోగా వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు.
ఈకేసును ధర్యాప్తు అధికారి పరిశోధించిన జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వై కృష్ణారెడ్డి ని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ డ్రామా
మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నలు దాచేందుకే నాటకం: కవిత
హైదరాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్
వడ్డెర సంఘం సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తా. మంత్రి దామోదర రాజనర్సింహ కు జోగిపేట లో చుక్కెదురు.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జోగిపేట 21 జనవరి (ప్రజా మంటలు) :
మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఇందిరమ్మ చీర తీసుకోవడానికి నిరాకరించిన మహిళలు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ నిలదీసిన మహిళలు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ... చరిత్రలో ఈరోజు జనవరి 21.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
చరిత్రలో ఈరోజు జనవరి 21
సంఘటనలు :
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
జననాలు :
1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య... సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్
హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్... 450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో... 15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ... బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబీన్ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు... తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి... శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది.
గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు... మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష
ప్రయాగ్రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20:
మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు.
జరిగిన... :కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన
కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)
హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.
క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను జగిత్యాల ఏరియా... 