పది నెలల తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా హత్య కేసులో నిందితుల గుర్తింపు
జగిత్యాల ఏప్రిల్ 3(ప్రజా మంటలు)
తేదీ 14-06-2024 రోజున బీర్పూర్ గ్రామ శివారులో రోళ్ల వాగు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి చంపినారని, అప్పటి బీర్పూర్ పంచాయితీ కార్యదర్శి పుర్రే చిన్న నర్సయ్య బీర్పూర్ పోలీసు స్టేషన్ లో ధరకాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తులో భాగంగా, మొదట అనుమానంతో మృతుడి యొక్క కుటుంబ సభ్యులయిన చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణకు మృతదేహాన్ని చూపించినా కానీ వారు ఆ శవం అతనిది కాదని ఒక అనాధ శవంలాగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మృతుడి యొక్క ఎముక భాగాలను డి ఎన్ ఏ పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ కు పంపి, చనిపోయిన వ్యక్తి అంకం లక్ష్మీనారాయణ, తండ్రి పేరు రాజం, 55 సంవత్సరాలు, నర్సింహులపల్లి గ్రామం గా గుర్తించి, ఈ విషయం నిందితులకు తెలియచేసినా కానీ వారిలో ఎలాంటి భాద లేకపోవడం మరియు మృతుడికి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించాల్సిన కర్మ కాండలు జరిపించలేదు.
, మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ప్రవర్తన మీద అనుమానం ఉండటం తో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట వారు నేరం అంగీకరించలేదు.
ఇట్టి వారికి ఎఫ్ఎస్ఎల్, హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఆధునాతన సాంకేతిక పరిజ్ణానం పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్ట్ కు మృతుడి చిన్న కుమారుడు అంకం సాయి కుమార్ మరియు భార్య అంకం అరుణ ను పంపి ఆ టెస్ట్ ఫలితాల ద్వారా అంకం లక్ష్మినారాయణను హత్య చేసింది వారేనని నిర్ధారించుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితులు అంకం సాయికుమార్ తన తండ్రి అంకం లక్ష్మీనారాయణ రోజూ తాగి వచ్చి, ఏ పని లేకుండా గొడవ చేస్తున్నాడని ఉద్దేశంతో, మృతుడి యొక్క కొడుకు మరియు తన భార్య ఇద్దరు కలిసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చినారని నేరం ఒప్పుకోగా వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు.
ఈకేసును ధర్యాప్తు అధికారి పరిశోధించిన జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వై కృష్ణారెడ్డి ని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)