విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

On
విడిసి చొరవతో... రాలిన

పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...?
గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు

ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి

బుగ్గారం ఏప్రిల్ 18:

గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత ఆరేండ్ల సమస్యకు "పరిష్కారం" లభించింది.
గతంలో ఈ యొక్క పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా "న్యాయం" జరుగలేదని బాధితుని ఆరోపణ. 

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన పచ్చిమట్ల సత్తన్న గౌడ్ అనే వ్యక్తికి తన కుటుంబ సభ్యులతో పంచాయతీ ఏర్పడ్డది. కాగా గత ఆరు సంవత్సరాల క్రితం కుల సంఘం మండల అధ్యక్షుడు అయిన అప్పటి అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు (తాజా మాజీ ప్రజా ప్రతినిధి భర్త) చట్టానికి విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఈ పంచాయతీని చేతబట్టాడు. ఇరువర్గాల వద్ద రూ.5000 (ఐదు వేల) చొప్పున దడువత్ తీసుకున్నాడు.
గత ఆరేండ్ల నుండి పంచాయతీ తెంపేది లేదు. బాధితుడికి న్యాయం చేసేది లేదు. తీసుకున్న దడువత్ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు. గతంలోనే ఈ పంచాయతీ కాస్త స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లింది. అయినా నేటికీ పరిష్కారంకు నోచుకోలేదు. పంచాయతీ తెగక పోవడంతో విసిగి వేసారిన బాధితుడు తన దడువత్ డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గత ఆరేండ్ల నుండి సదరు నాయకుని వద్దకు తిరుగుతున్నాడు. ఎంత తిరిగినా.... ఎంత బ్రతిమి లాడినా.... కుల సంఘం జిల్లా పెద్దల వరకు వెళ్ళినా.... సదరు నాయకుడు ససేమిరా అంటూ... కుంటి సాకులతో... ఆ దడువత్ డబ్బులు నేటికీ తిరిగి ఇవ్వడం లేదు. చివరకు మరో రాజకీయ నాయకుడు ఇచ్చిన సలహా మేరకు సదరు బాధితుడు బుగ్గారంలోని "గ్రామ అభివృద్ది కమిటీ" ని సంప్రదించాడు.

బాధితుడు చెప్పిన వివరాలన్ని గ్రహించి సాక్ష్యా దారాలను తెలుసుకొని, పలువురు పంచాయతీ పెద్దలతో మాట్లాడి విడిసి బృందం వాటిని పరిశీలించారు. వెంటనే సంబంధిత కుల సంఘం జిల్లా అధ్యక్షులతో సమస్యను, జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని వివరించారు. వెంటనే మీ కుల సంఘం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో బాధితునికి అండగా ఉండి న్యాయ పోరాటం చేయాల్సి ఉంటదని విడిసి బృందం ఆ జిల్లా అధ్యక్షునితో తేల్చి చెప్పింది. విడిసి బృందం అందజేసిన న్యాయమైన సూచనలతో సదరు కుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంటనే స్పందించారు.

కేవలం గంట వ్యవధి లోనే బాధితునికి సదరు రాజకీయ నాయకుడు సుమారు ఆరేండ్ల క్రితం తీసుకున్న దడువత్ రూ.5,000 బాధితుని వద్దకు వచ్చి తిరిగి చెల్లించాడు. 

 విడిసి కృషి వల్ల పేదవాడినైన నాయొక్క దడువత్ డబ్బులు తిరిగి వచ్చాయని బాధితుడు పచ్చిమట్ల సత్తన్న గౌడ్ హర్షం వ్యక్తం చేసారు.


కాగా ఇలాగే అనేక చోట్ల అక్రమంగా రాజకీయ నాయకులు, పంచాయతీల పెద్ద మనుషులు దడువత్ లు తీసుకుంటూ వేలాదిగానే కాకుండా లక్షల్లో కూడా దోచుకుంటున్నారని విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన ఎండిసి కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆరోపించారు.


అక్రమ దడువత్ లే కాకుండా దావత్ ల పేరుతో లక్షలాది రూపాయలు బాధిత పేద ప్రజల నుండి పంచాయతీ పెద్దలు దోచుకుంటున్నారని ఆయన వివరించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చిన్న - చిన్న తగాదాలతో లక్షల్లో నష్ట పోతున్నారని తెలిపారు.  పంచాయతీ పెద్ద మనుషులు స్వార్థపూరితంగా, రాజకీయంగా, కుట్ర పూరితంగా పంచాయతీ తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు.  చిన్న - చిన్న తగాదాలను కూడా పెద్దగా సృష్టించడం, ఏండ్ల తరబడి పంచాయతీలు పరిష్కారానికి నోచుకోకుండా చేయడంతో పేద ప్రజలు తీవ్రంగా మోస పోతున్నారని అన్నారు. సంబంధిత అధికారుల పేరుతో కూడా పంచాయతీ పెద్దలు, రాజకీయ నేతలు నేటికీ కూడా భారీ దోపిడీలకు పాల్పడుతున్నారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని బుగ్గారం విడిసి విజ్ఞప్తి చేస్తోందన్నారు. లేకుంటే నిరుపేదలు ఈ పంచాయతీల పేరుతో జరిగే దోపిడీలను, మద్యం -  మాంసంతో కూడిన దావత్  (విందు) లను, పంచాయతీ దళారుల చేష్టలను తట్టుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చుక్క గంగారెడ్డి సూచించారు.

Tags

More News...

Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...
Local News 

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు సిఐటియూ జెండాను  ఆవిష్కరించిన మండల సిఐటియు  అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు....
Read More...
Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...