తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు..
*జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ దళిత ఎంప్లాయిస్ ఆవేదన
*ఉన్నతాధికారులకు ఫిర్యాదు
సికింద్రాబాద్ ఏప్రిల్07 (ప్రజామంటలు) :
జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని ఓసంస్థ పేరుతో ఓ వ్యక్తి తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్ఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సోమవారం రాష్ర్ట ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందచేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ,సిటీ పోలీస్ కమిషనర్,జీహెచ్ఎమ్సీ కమిషనర్,చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్, జీహెచ్ఎమ్సీ కమిషనర్, జోనల్ కమిషనర్ లకు తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో తెలిపారు. ముప్పిడి నవీన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఆండ్ ఫౌండర్ దళిత చేతన సంఘం పేరున గత కొంత కాలంగా జీహెచ్ఎమ్సీ లోని టౌన్ ప్లానింగ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ, డబ్బులను డిమాండ్ చేస్తున్నాడని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. అంబర్పేట, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో సదరు వ్యక్తిపై అనేక పోలీసు కేసులున్నాయని, బిల్డింగ్ ఓనర్ల ఫిర్యాదు తో అనేక సార్లు అరెస్ట్ కూడ అయ్యాడని వారు పేర్కొన్నారు. ఎలాంటి ఆదారాలు లేకుండా ఈ వ్యక్తి చేస్తున్న ఆరోపణలతో టౌన్ ఫ్లానింగ్ ఉద్యోగ సిబ్బంది ఆత్మస్టైర్యం దెబ్బతింటుందన్నారు. తమ ఆరోపణలపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ.శ్రీధర్, తోటి నాయకులతో కలసి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ను కలిసి వినతిపత్రం అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
