సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

On
సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

పెన్షనర్ల  సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించాలి.                    
-పెన్షనర్ల ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం.      
 జగిత్యాల అక్టోబర్ 21:

పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం  ఇంకా జాప్యం చేయక వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ ప్రయోజనాలు అందక కొందరు అనారోగ్యం బారిన పడుతున్నారని, మరి కొందరు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని   ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన దీపావళి సమ్మేళనం లో తెలంగాణ పండుగలు -సంప్రదాయాలపై టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ప్రసంగించారు.IMG-20251022-WA0001 తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో  పేద మహిళలు 12 మందికి దీపావళి కానుకలు గా నూతన వస్త్రాలు, దుప్పట్లు జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ చేతుల మీదుగా అందజేసి వారిని సన్మానించారు.

అనంతరం జిల్లా లో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 12 మంది రిటైర్డ్ ఉద్యోగులకు దీపావళి పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి  హరి అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సి. హన్మంత్ రెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం, ఉపాధ్యక్షులు వెల్ ముల ప్రకాష్ రావు,   సత్యనారాయణ,ఎం. డీ. యా కూబ్,  జగిత్యాల యూనిట్ అధ్యక్షులు  బి. రాజేశ్వర్, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షులు మురళి, రాయికల్ అధ్యక్షులు వై. వేణు గోపాల్ రావు, మల్యాల అధ్యక్షులు ఎం. డీ.యా కూబ్, కార్యదర్శి వీరారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ. పెన్షనర్ల  సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించాలి.                     -పెన్షనర్ల ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం.              జగిత్యాల అక్టోబర్ 21: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం  ఇంకా జాప్యం చేయక వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా...
Read More...

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు ముజఫర్ పూర్ (బీహార్) అక్టోబర్ 22: బీహార్ ముఖ్యమంత్రి, జెడీయూ అధినేత నితీశ్ కుమార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ముజఫ్ఫర్‌పూర్ జిల్లా మీనాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో ఆయన చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, 75 ఏళ్ల నితీశ్ కుమార్, బీజేపీ అభ్యర్థి రామ నిషాద్కు మాల వేసేందుకు...
Read More...
Spiritual   State News 

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌ హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు):  హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మంగళవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. “భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం...
Read More...
National  State News 

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం చెన్నై అక్టోబర్ 21:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉద్ధయనిధి స్టాలిన్ చేసిన దీపావళి శుభాకాంక్షల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఒక పబ్లిక్ కార్యక్రమంలో ఉద్ధయనిధి మాట్లాడుతూ – “విశ్వాసం ఉన్న వారికే హ్యాపీ దీపావళి” అని చెప్పినందుకు హిందూ సంస్థలు మరియు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ...
Read More...
National  Sports  International  

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు న్యూ ఢిల్లీ అక్టోబర్ 21: ఆసియా కప్ 2025 ట్రోఫీపై BCCI మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. భారత జట్టు టోర్నమెంట్ గెలిచినప్పటికీ, ఇప్పటివరకు ట్రోఫీ అందించలేదు. ఈ నిర్ణయం ఇప్పుడు ICC సమావేశంలో తీసుకోబడనుంది. PCB చీఫ్ మరియు ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ,...
Read More...
National  International  

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై కఠిన హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై 155 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధిస్తామని ఆయన ప్రకటించారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్,“మోదీతో మాట్లాడాను. ఆయన రష్యా చమురు కొనడం ఆపుతానని...
Read More...
Local News 

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు సికింద్రాబాద్, అక్టోబర్ 21 (ప్రజామంటలు) : పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు సిటీలోని ఫుట్ పాత్ లపై దుర్బర జీవితం గడుపుతున్న నిరాశ్రయుల మద్య దీపావళి వేడుకలను నిర్వహించారు. దీపావళి పండుగను నిరాశ్రయులు, అనాథల మధ్య ప్రత్యేకంగా జరిపి వారికి ఆనందం పంచారు. నగరంలోని రోడ్ల పక్కన, వారితో కలిసి దీపాలు వెలిగిస్తూ...
Read More...
Local News 

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్ (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 21 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం, స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దాడి,మల్లేష్ బొటనీ విభాగం లో ఇథనోమిడిసినల్ ప్లాంట్స్ పై పరిశోధన చేసినందుకు  గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య...
Read More...
National  International  

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు

చైనాపై మళ్లీ ట్రంప్ దాడి – 155% టారిఫ్‌తో వాణిజ్య ఉద్రిక్తతలు వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై కఠిన వైఖరి ఎత్తుకున్నారు. అమెరికా ప్రయోజనాలను రక్షించేందుకు చైనా దిగుమతులపై 155 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఆర్థిక ఉద్రిక్తతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తన ప్రసంగంలో, “చైనా అమెరికాను...
Read More...

మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్

మునుగోడు లో మద్యం పాలసీపై కలకలం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు): మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామాల్లో మద్యం దుకాణాల అనియంత్రిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మద్యం వ్యాపారులను కంగారు పెట్టాయి. రాజగోపాల్ రెడ్డి తాజాగా ప్రకటించిన నిబంధనల ప్రకారం —...
Read More...
Filmi News  State News 

రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర

రేణు దేశాయ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం – కామెడీ సినిమాలో కీలక పాత్ర హైదరాబాద్ అక్టోబర్ 21: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "బాద్రి" సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయిన...
Read More...
State News 

వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి

వామపక్ష తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవండి - సీఎం రేవంత్ రెడ్డి “పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అన్ని ముఖ్య సంస్థలకు మహిళల సారధ్యం కానిస్టేబుల్ ప్రమోద్ కు ₹ కోటి పరిహారం,భార్యకు ఉద్యోగం విధినిర్వహణలో అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు  హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు): వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో...
Read More...