పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం
మెట్ పల్లి జులై 10 (ప్రజా మంటలు)
రైతులు నాట్లు వేసే ప్రస్తుత ముమ్మర దశలో పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
గురువారం ఉదయం గుండంపల్లి గ్రామం సందర్శించిన సందర్భంగా మెటుపల్లి ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు ట్రాన్స్ఫార్మర్ లపై ఫ్యూజ్ లు పోయినపుడు సంబంధిత సిబ్బందికి సమాచారం అందిస్తే సరిచేస్తారని, కానీ తమకు తాముగా వేసుకొనే ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయితే అదనపు ట్రాన్స్ఫార్మర్లు అందిస్తామని, వదులుగా యుండి వేలాడే తీగల మధ్య అంతర స్తంభాలు వేస్తామని, కొత్త కనెక్షన్లు సత్వరంగా జారీ చేస్తామని తెలిపారు. మోటారు కు ఐరన్ బాక్స్ స్థానంలో ఫైబర్ బాక్స్ అమర్చుకోవాలని, వన్యప్రాణుల నుండి పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని, ఇళ్లల్లో బట్టలు ఆరవేసుకునేందుకు జీఐ వైరు ఉపయోగించరాదని సూచించారు.
జగిత్యాల జిల్లా లో విద్యుత్ ప్రమాదాలను రాబోయే నెలరోజుల్లో జీరో స్థాయికి తగ్గించడానికి ప్రతీ అధికారి, సిబ్బంది నిబద్ధతతో కృషి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఇంచార్జి ఏడీఈ మనోహర్, రాఘవపేట ఏఈ సంతోష్, రైతు నాయకులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, రాజేందర్ సిబ్బంది సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
